ETV Bharat / state

రెవెన్యూశాఖలో సమూల మార్పులు: కేసీఆర్

author img

By

Published : Aug 30, 2020, 5:28 AM IST

వివాదాలు లేని భూ దస్త్రాల నిర్వహణే ధ్యేయంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెలలో నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజలకు సులువుగా, పారదర్శకంగా భూ సంబంధిత సేవలు అందించాలనేది ప్రభుత్వ అభిమతం.

CM KCR Meeting on Revenue Bill in Assembly Session
రెవెన్యూశాఖలో సమూల మార్పులు: కేసీఆర్

రెవెన్యూ చట్టం బిల్లుపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. సంబంధిత అంశాలపై చర్చించారు.

ప్రజలకు సులువుగా జవాబుదారీతనంతో సేవలు అందేలా పొందిపరచాల్సిన అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేకించి భూ పరిపాలన విషయంలో అనుసరించాల్సిన విధానంపై లోతుగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు తెలిసింది. వాటి ఆధారంగా అధికారులు తదుపరి కసరత్తు చేయనున్నారు.

రెవెన్యూ చట్టం బిల్లుపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. సంబంధిత అంశాలపై చర్చించారు.

ప్రజలకు సులువుగా జవాబుదారీతనంతో సేవలు అందేలా పొందిపరచాల్సిన అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేకించి భూ పరిపాలన విషయంలో అనుసరించాల్సిన విధానంపై లోతుగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని అంశాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు తెలిసింది. వాటి ఆధారంగా అధికారులు తదుపరి కసరత్తు చేయనున్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.