ETV Bharat / state

ప్రభుత్వంపై దశల వారీగా కాంగ్రెస్​ పోరాటం - రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎల్పీ సమావేశం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, విచ్చలవిడి మద్యం అమ్మకాలపై పోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు మద్యమే ప్రధాన కారణమని.. తక్షణమే బెల్ట్‌ షాపులను మూసివేయాలని డిమాండ్‌ చేసింది. దశలవారీ పోరాటంతో అధికార పార్టీ వైఖరిని ఎండగట్టేందుకు హస్తం పార్టీ సిద్ధం అవుతోంది. దిశ ఘటనపై నిరసనగా శనివారం ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, గవర్నర్‌కు నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.

ప్రభుత్వంపై దశల వారీగా కాంగ్రెస్​ పోరాటం
ప్రభుత్వంపై దశల వారీగా కాంగ్రెస్​ పోరాటం
author img

By

Published : Dec 6, 2019, 12:43 PM IST

ప్రభుత్వంపై దశల వారీగా కాంగ్రెస్​ పోరాటం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మద్యం విచ్చలవిడిగా అమ్మకాల వల్లే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించింది. దిశ ఘటనను పార్లమెంటులోనూ ప్రస్తావించిన కాంగ్రెస్‌ ఎంపీలు... తెరాస ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. గురువారం అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్​ శాసనసభాపక్షం.. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులు, పోలీసుల పనితీరుపై ప్రధానంగా చర్చించింది.

ప్లకార్డులతో నిరసన:

దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం ముగియగానే సీఎల్పీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డిలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న మద్యం, బెల్ట్‌ దుకాణాల వల్లే యువత పెడదారి పడుతోందని నేతలు ఆరోపించారు. తక్షణమే వీటిని మూసివేయించాలని డిమాండ్‌ చేశారు. దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించారు.

గవర్నర్​కు వినతి పత్రం..

హస్తం పార్టీ పోలీసు శాఖ పనితీరును కూడా తప్పుబట్టింది. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు.. తెరాస నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. మహిళలపై దాడులకు నిరసనగా శనివారం ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి.. గవర్నర్‌ తమిళిసైకి వినతి పత్రం ఇస్తామన్నారు. దిశ హత్యోదంత నిందితులకు ఉరి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: దిశ నిందితులకు చట్ట ప్రకారమే శిక్ష : కేటీఆర్

ప్రభుత్వంపై దశల వారీగా కాంగ్రెస్​ పోరాటం

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మద్యం విచ్చలవిడిగా అమ్మకాల వల్లే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించింది. దిశ ఘటనను పార్లమెంటులోనూ ప్రస్తావించిన కాంగ్రెస్‌ ఎంపీలు... తెరాస ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. గురువారం అత్యవసరంగా సమావేశమైన కాంగ్రెస్​ శాసనసభాపక్షం.. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులు, పోలీసుల పనితీరుపై ప్రధానంగా చర్చించింది.

ప్లకార్డులతో నిరసన:

దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం ముగియగానే సీఎల్పీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డిలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న మద్యం, బెల్ట్‌ దుకాణాల వల్లే యువత పెడదారి పడుతోందని నేతలు ఆరోపించారు. తక్షణమే వీటిని మూసివేయించాలని డిమాండ్‌ చేశారు. దశలవారీగా పోరాటం చేయాలని నిర్ణయించారు.

గవర్నర్​కు వినతి పత్రం..

హస్తం పార్టీ పోలీసు శాఖ పనితీరును కూడా తప్పుబట్టింది. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు.. తెరాస నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. మహిళలపై దాడులకు నిరసనగా శనివారం ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి.. గవర్నర్‌ తమిళిసైకి వినతి పత్రం ఇస్తామన్నారు. దిశ హత్యోదంత నిందితులకు ఉరి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: దిశ నిందితులకు చట్ట ప్రకారమే శిక్ష : కేటీఆర్

TG_HYD_53_05_CLP_OVERALL_PKG_3038066 Reporter: Tirupal Reddy Dry గమనిక: భట్టి ప్రెస్‌మీట, ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్, సీఎల్పీ సమావేశం ఈ మూడు రకాల విజువల్స్‌ కూడా సీఎల్పీ ఓఎఫ్‌సీ నుంచి వచ్చాయి. వాడుకోగలరు ()తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే మహిళలపై అత్యాచారాలకు కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మద్య నియంత్రణలపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. దిశ హత్యోదంత నిందితులను ఉరితీయాలని సీఎల్పీ డిమాండ్‌ చేసింది. తక్షణమే రాష్ట్రంలో బెల్ట్‌ దుకాణాలను మూసివేయించనట్లయితే ప్రత్యక్ష పోరాట కార్యాచరణ సిద్ధం కానున్నట్లు ప్రకటించింది. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను కాంగ్రెస్ శాసనసభాపక్షం తీవ్రంగా తీసుకుంది. ఇవాళ అత్యవసరంగా సమావేశమైన సీఎల్పీ సమావేశం విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలు, మహిళలపై జరగుతున్న లైంగికదాడులనే ప్రధాన అంశాలుగా తీసుకుని చర్చించింది. దాదాపు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం ముగియగానే సీఎల్పీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డిలు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ప్రజా వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని...అందుకు రాష్ట్రంలో విచ్చల విడిగా జరుగుతున్న మద్యం విక్రయాలేనని ఆరోపించారు. స్పాట్‌ విజువల్స్‌...ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న విజవల్స్‌ వాడుకోగలరు... వాయిస్ఓవర్‌2: తెలంగాణలో వరుసుగా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరినే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు విచ్చలవిడి మద్యం అమ్మకాలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్వమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకుని మద్యం అమ్మకాలు చేస్తున్నారని, జాతీయ రహదారుల వెంట ఉన్న ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను మూసి వేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే...తామే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. బైట్: భట్టి విక్రమార్క. సీఎల్పీ నేత వాయిస్ ఓవర్‌3: దిశా హత్యోదంత ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కోసం పని చేస్తున్నట్లు ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ ప్రజా రక్షణ కోసం పని చేయాలి కాని...అధికార తెరాస కోసం కాదని ద్వజమెత్తారు. దిశా నిందితులకు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైట్: భట్టి విక్రమార్క. సీఎల్పీ నేత ఎండు వాయిస్4:- దిశ ఘటనను నిరసిస్తూ...ఎల్లుండి ట్యాంక్‌ బండ్‌ మీద అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నుంచి రాజ్‌భవన్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. పీసీసీ కార్యవర్గ నాయకులు అంతా ర్యాలీలో పాల్గొని గవర్నర్‌ తమిళ సై సౌందర్‌ రాజన్‌ను కలిసి వినతి పత్రం కాంగ్రెస్‌ నేతలు ఇవ్వనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.