Bhatti fired on KCR: చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతున్న తెరాస ప్రభుత్వానికి చావు డప్పు మోగిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అన్నదాతల ఆత్మహత్యలకు తెరాస కారణమవుతోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తెలంగాణలో రణం చేస్తున్నట్టు రైతులను మభ్యపెట్టడుతున్నారని భట్టి విమర్శించారు. వచ్చే యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస ఆధ్వర్యంలో కేసీఆర్ దిల్లీలో ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు.
మభ్య పెడుతున్నారు
కేంద్ర మంత్రులు అందుబాటులో ఉండరని తెలిసి, పార్లమెంటు సమావేశాలు లేని శని, ఆదివారాల్లో మంత్రులు, ఎంపీల బృందం ఎవరిని కలుద్దామని దిల్లీకి వెళ్లారని భట్టి ప్రశ్నించారు. రైతుల సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే తెరాస బృందం ముందుగానే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకునేవారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తెరాస మాత్రమే కొట్లాడుతోందని.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం కోసమే సీఎం కేసీఆర్ పథకం ప్రకారం దిల్లీకి తాను వెళ్లకుండా మంత్రుల బృందాన్ని పంపించి రాజకీయం చేస్తున్నారని ధ్వజ మెత్తారు.
ఇదీ చదవండి: CAG Report: మిషన్కాకతీయతో తెలంగాణలో పెరిగిన భూగర్భ జలమట్టం