హైదరాబాద్ సోమాజిగూడలోని విద్యుత్ సౌధ వద్ద సీఐటీయూ, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ 2020 బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ చట్టం అమలులోకి వస్తే విద్యుత్ ఉద్యోగులకు భద్రత ఉండదని... రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత విద్యుత్తో పాటు... రాయితీల భారం మరింతగా పడుతుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాల్, ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు ఆరోపించారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయం మూసి.. రెండు నెలలు పూర్తి..