భారత క్రికెట్ జట్టు ఆటగాడు మహ్మద్ సిరాజ్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 13న.. నగర శివారులో వైభవంగా జరిగాయి. 27 వసంతాలు పూర్తి చేసుకున్న సిరాజ్.. తన జన్మదిన వేడుకల్లో సందడి చేశారు. మిత్రులు, అభిమానులతో కలిసి నృత్యాలు చేశారు.
సిరాజ్ జన్మదినం సందర్బంగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ట్విట్టర్ వేదికగా హైదరాబాదీ క్రికెటర్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: నిజామాబాద్లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం