బుధవారం సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిర్వహించే భాజపా ప్రాంతీయ జన్ సంవాద్ (వర్చువల్ ర్యాలీ)లో పెద్దఎత్తున పాల్గొన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొంటారని తెలిపారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి.. ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీ తలపెట్టినట్లు సంజయ్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని ప్రజలను కోరారు.
ఏడాది పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై రాంమాధవ్ దిశానిర్దేశం చేయనున్నారని కార్యకర్తలకు సూచించిన సంజయ్.. దీనిపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.