హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దుబ్బాక సీటును ఎట్టి పరిస్థితిలో గెలవాలనే ఉద్దేశంతో తెరాస నాయకులు ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా బండి సంజయ్తో వ్యవహరించారని విమర్శించారు.
తాము అనుకుంటే ఏదైనా చేస్తామని... కానీ భాజపా నిజాయతీతో నడిచే పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా దుబ్బాక ప్రజలు మేలు కోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.
ఇదీ చదవండి: దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్.. ప్రగతిభవన్ వద్ద భారీగా బలగాలు