ETV Bharat / state

KISHAN REDDY:'న్యాయవాదులకు కేంద్ర సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి' - hyderabad latest news

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని బార్‌ కౌన్సిల్‌, సీనియర్‌ న్యాయవాదులు కలిశారు. హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగేందుకు తనవంతు కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. న్యాయవాదులకు కేంద్రం సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు.

Bar Council, senior lawyers met Union Minister Kishan Reddy
Bar Council, senior lawyers met Union Minister Kishan Reddy
author img

By

Published : Jun 17, 2021, 5:58 PM IST

దక్షిణ భారతదేశంలోనే కోటి మంది జనాభాతో హైదరాబాద్‌ పెద్ద నగరంగా ఉందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. జనాభాతో పాటు అదే స్థాయిలో రకరకాల కేసులు కోర్టుల్లో పెండింగ్​లో ఉన్నాయన్నారు. అందువల్లే అదనపు జడ్జిలు కావాలని కోరామని తెలిపారు.

హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగేందుకు తనవంతు కృషి చేసిన కిషన్​రెడ్డిని హైదర్‌గూడలోని క్యాంపు కార్యాలయంలో బార్‌ కౌన్సిల్‌, సీనియర్‌ న్యాయవాదులు కలిశారు. ఈ మేరకు మంత్రికి శాలువా కప్పి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కేంద్రం సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు.

దక్షిణ భారతదేశంలోనే కోటి మంది జనాభాతో హైదరాబాద్‌ పెద్ద నగరంగా ఉందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. జనాభాతో పాటు అదే స్థాయిలో రకరకాల కేసులు కోర్టుల్లో పెండింగ్​లో ఉన్నాయన్నారు. అందువల్లే అదనపు జడ్జిలు కావాలని కోరామని తెలిపారు.

హైకోర్టులో జడ్జిల సంఖ్య 24 నుంచి 42కు పెరిగేందుకు తనవంతు కృషి చేసిన కిషన్​రెడ్డిని హైదర్‌గూడలోని క్యాంపు కార్యాలయంలో బార్‌ కౌన్సిల్‌, సీనియర్‌ న్యాయవాదులు కలిశారు. ఈ మేరకు మంత్రికి శాలువా కప్పి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కేంద్రం సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: TSRTC CCS: అప్పు చెల్లించకపోతే... దివాళా తీయాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.