ఏపీఎస్ఆర్టీసీలోని అద్దె బస్సులన్నీ జనవరి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే ఈ నెల 1 నుంచి అద్దె బస్సుల్లోని ఎక్స్ప్రెస్లు, సిటీల్లో మెట్రో ఎక్స్ప్రెస్లు కలిపి 250 సర్వీసులు మొదలయ్యాయి.
ఇంద్ర మినహా మిగిలిన సర్వీసులను జనవరి 1 నుంచి వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల రీజినల్ మేనేజర్లకు గురువారం ఆదేశాలు పంపారు.