ఏపీ పురపాలక శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్లో పర్యటించారు. గ్రేటర్లో అమలవుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఏపీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో 23 మంది సీనియర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ల బృందం జీహెచ్ఎంసీ కమిషనర్తో సమావేశమైంది. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీలో అమలవుతున్న కార్యక్రమాలను.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ లోకేశ్కుమార్ వివరించారు.
అనంతరం ఇందిరాపార్క్లోని పంచతంత్ర పార్క్, సంజీవయ్య పార్క్ సమీపంలోని సెకండరీ కలెక్షన్ కేంద్రం, హెర్బల్ పార్క్, తార్నాకలోని స్మార్ట్ బస్స్టేషన్, ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని లో-కేఫ్, మొబైల్ టాయిలెట్, గచ్చిబౌలిలో పాలపిట్ట సైక్లింగ్ ట్రాక్, డాగ్ పార్క్, దుర్గం చెరువు సుందరీకరణ పనులు, సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జూబ్లీహిల్స్లోని వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్, అంబర్పేట్లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను అధికారుల బృందం సందర్శించింది.
ఇవీచూడండి: జూన్లోగా సీతారామ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలి: రజత్ కుమార్