ETV Bharat / state

తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేసింది: ఏపీ హైకోర్టు

author img

By

Published : Dec 31, 2020, 7:32 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల వేలంపై వ్యాజ్యాల విచారణలో... ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ తప్పుకోవాలంటూ.... ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్‌ దాఖలు చేసిందని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ వేసిన మిషన్ బిల్డ్- ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌పై... ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ నుంచి తప్పుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

high court
high court

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ.. ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్‌ దాఖలు చేసిందని.. ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ధిక్కార చర్యేనని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయస్థానాన్ని చులకన చేయడమేనన్న ధర్మాసనం... కోర్టు విధుల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చిచెప్పింది. అలాంటి అఫిడవిట్‌ దాఖలు చేసిన మిషన్‌ బిల్డ్‌-ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌పై ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి తప్పుడు వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేశారని తెలిపింది. కోర్టు డాకెట్‌షీట్‌లో సహా... అనుబంధ పిటిషన్‌తో జత చేసిన దస్త్రాలు... అధికారి ఆరోపణలను బలపరిచేటట్లు లేవని స్పష్టం చేసింది. అలాంటి అఫిడవిట్‌ వేయడం నేరానికి పాల్పడినట్లు భావించి..... చట్టప్రకారం విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో... 6 వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ వేసిన ప్రవీణ్‌కుమార్‌పై... నేర విచారణ జరిపేందుకు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాలని.... ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పిటిషన్లు వేయడానికి సాహసించకుండా చూడాలని పేర్కొంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఆ రాష్ట్ర ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఈనెల 11న విచారణలో.. జస్టిస్ రాకేశ్‌కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... మిషన్‌ బిల్డ్‌-ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వం ఏ విధంగా వేలం వేస్తుంది..? అలా చేయడానికి ఏపీ ప్రభుత్వం దివాలా తీస్తోందా..? అని జస్టిస్ అన్నట్లు అందులో పేర్కొన్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తామని... పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామంటూ జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారని... ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరారు. దీనిపై... బుధవారం మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం.... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్‌ వేశారని స్పష్టం చేసింది.

ఈ కేసులో.. న్యాయాధికారులు ఏపీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తేది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఆజ్ఞాపించినట్లు కాకుండా.. న్యాయాధికారులు సరైన సలహా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఏపీ బార్‌ న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులూ క్రమశిక్షణ, నిబద్ధతతో ఉన్నారని గుర్తు చేసింది. అయితే కొందరు ఆ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయాధికారులను.. వారితో సమానంగా పరిగణనలోకి తీసుకోలేమంది. ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ.. ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్‌ దాఖలు చేసిందని.. ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ధిక్కార చర్యేనని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయస్థానాన్ని చులకన చేయడమేనన్న ధర్మాసనం... కోర్టు విధుల్లో జోక్యం చేసుకోవడమేనని తేల్చిచెప్పింది. అలాంటి అఫిడవిట్‌ దాఖలు చేసిన మిషన్‌ బిల్డ్‌-ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌పై ధర్మాసనం కన్నెర్ర చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి తప్పుడు వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేశారని తెలిపింది. కోర్టు డాకెట్‌షీట్‌లో సహా... అనుబంధ పిటిషన్‌తో జత చేసిన దస్త్రాలు... అధికారి ఆరోపణలను బలపరిచేటట్లు లేవని స్పష్టం చేసింది. అలాంటి అఫిడవిట్‌ వేయడం నేరానికి పాల్పడినట్లు భావించి..... చట్టప్రకారం విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో... 6 వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ వేసిన ప్రవీణ్‌కుమార్‌పై... నేర విచారణ జరిపేందుకు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాలని.... ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పిటిషన్లు వేయడానికి సాహసించకుండా చూడాలని పేర్కొంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఆ రాష్ట్ర ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఈనెల 11న విచారణలో.. జస్టిస్ రాకేశ్‌కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... మిషన్‌ బిల్డ్‌-ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వం ఏ విధంగా వేలం వేస్తుంది..? అలా చేయడానికి ఏపీ ప్రభుత్వం దివాలా తీస్తోందా..? అని జస్టిస్ అన్నట్లు అందులో పేర్కొన్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తామని... పరిపాలనను కేంద్రానికి అప్పగిస్తామంటూ జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారని... ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరారు. దీనిపై... బుధవారం మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం.... ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్యాలు, తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్‌ వేశారని స్పష్టం చేసింది.

ఈ కేసులో.. న్యాయాధికారులు ఏపీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి తలెత్తేది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఆజ్ఞాపించినట్లు కాకుండా.. న్యాయాధికారులు సరైన సలహా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఏపీ బార్‌ న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులూ క్రమశిక్షణ, నిబద్ధతతో ఉన్నారని గుర్తు చేసింది. అయితే కొందరు ఆ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయాధికారులను.. వారితో సమానంగా పరిగణనలోకి తీసుకోలేమంది. ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.