రాష్ట్రంలో కొత్తగా 1,481 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 34 వేల 152 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,319 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా 1,451 మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 14 వేల 917 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 17, 916 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసొలేషన్లో 14,883 మంది ఉన్నారు.