ప్రగతిభవన్ ఎదుట రాజ్యలక్ష్మి అనే యువతి హల్చల్ చేసింది. సీఎం కేసీఆర్ తమ సమస్యలు వినాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా పేదలకు న్యాయం జరగాలంటూ, తమ సమస్యలు కేసీఆర్ వినాలని నిరసన తెలిపింది. లాక్డౌన్తో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులు, ప్రజలను మోసం చేసిందని ఆరోపించింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకుంటుండగా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాధలను మీడియాకు చెప్పుకుంటానని.. తనకు అవకాశమివ్వాలని కోరింది.
పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తుండగా.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిల్లా పనిచేయాలి: షబ్బీర్ అలీ