ETV Bharat / state

రోడ్డు భద్రత గాలికి... ప్రాణాలు గాల్లోకి!

రోడ్డు భద్రతపై ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎంతమంది మరణిస్తున్నా ఆలోచన మారడం లేదు. ఏడాదికాలంలో రోడ్డు భద్రత పాటించని వారు సుమారు కోటి ఉన్నారంటే.. నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతోంది.

author img

By

Published : Feb 14, 2020, 10:47 AM IST

70% of road accidents cases are not wearing a helmet in telangana
రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం హెల్మెట్ ధరించని కేసులే

స్వీయ భధ్రతను ద్విచక్ర వాహనదారులు విస్మరిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో తలకు చిన్నపాటి గాయమైనా ప్రాణాలు పోయే అవకాశమున్నా.. శిరసాస్త్రం మాత్రం ధరించడం లేదు. హెల్మెట్ లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు.

దాదాపు 77శాతం వరకు ఇలాంటి కేసులే నమోదవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఈ పరిస్థితి అద్దం పడుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ప్రాణాంతకంగా మారిన వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ తరహా 12 ఉల్లంఘనల్లో గత ఏడాది సుమారు కోటికి చేరువచ్చాయి. వీటిలో హెల్మెట్ ధరించని కేసులే 70శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసులు 72వేల వరకు నమోదయ్యాయి.

ఒక్క హైదరాబాద్ కమిషనరేట్​లోనే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు 2,493 జరగ్గా.. అందులో 951 మంది ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. సుమారు 1200 వందల మంది మృతులు, క్షతగాత్రులుగా మారారు.

గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబుల వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకునేవి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా జరగడం వల్ల మందుబాబులు దారికొస్తున్నారు. గత ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒక్కశాతం మాత్రమే నమోదయ్యాయి.

గత సంవత్సరం నమోదైన కేసులివే...

  1. శిరసాస్త్రం లేకుండా ప్రయాణం - 72,74,713
  2. అతివేగం - 8,25,599
  3. రాంగ్ రూట్ - 5,40,022
  4. ట్రిపుల్ డ్రైవింగ్ - 3,06,775
  5. ఓవర్ లోడ్ - 2,85204
  6. తప్పుడు నంబర్ ప్లేట్లు - 2,70,895
  7. డ్రంక్ అండ్ డ్రైవ్ - 99,620
  8. సీటు బెల్టు లేని ప్రయాణం - 84,279
  9. సెల్ ఫోన్ డ్రైవింగ్ - 83,003
  10. సిగ్నల్ జంపింగ్ - 78,438
  11. మైనర్ డ్రైవింగ్ - 10,336

ఇదీ చూడండి : ఎన్​ఆర్​ఐతో పెళ్లి విషయంలో మహిళలూ... జర భద్రం !!

స్వీయ భధ్రతను ద్విచక్ర వాహనదారులు విస్మరిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో తలకు చిన్నపాటి గాయమైనా ప్రాణాలు పోయే అవకాశమున్నా.. శిరసాస్త్రం మాత్రం ధరించడం లేదు. హెల్మెట్ లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. ప్రాణాలు కోల్పోతున్నారు.

దాదాపు 77శాతం వరకు ఇలాంటి కేసులే నమోదవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఈ పరిస్థితి అద్దం పడుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ప్రాణాంతకంగా మారిన వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ తరహా 12 ఉల్లంఘనల్లో గత ఏడాది సుమారు కోటికి చేరువచ్చాయి. వీటిలో హెల్మెట్ ధరించని కేసులే 70శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసులు 72వేల వరకు నమోదయ్యాయి.

ఒక్క హైదరాబాద్ కమిషనరేట్​లోనే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు 2,493 జరగ్గా.. అందులో 951 మంది ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యారు. సుమారు 1200 వందల మంది మృతులు, క్షతగాత్రులుగా మారారు.

గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబుల వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకునేవి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా జరగడం వల్ల మందుబాబులు దారికొస్తున్నారు. గత ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒక్కశాతం మాత్రమే నమోదయ్యాయి.

గత సంవత్సరం నమోదైన కేసులివే...

  1. శిరసాస్త్రం లేకుండా ప్రయాణం - 72,74,713
  2. అతివేగం - 8,25,599
  3. రాంగ్ రూట్ - 5,40,022
  4. ట్రిపుల్ డ్రైవింగ్ - 3,06,775
  5. ఓవర్ లోడ్ - 2,85204
  6. తప్పుడు నంబర్ ప్లేట్లు - 2,70,895
  7. డ్రంక్ అండ్ డ్రైవ్ - 99,620
  8. సీటు బెల్టు లేని ప్రయాణం - 84,279
  9. సెల్ ఫోన్ డ్రైవింగ్ - 83,003
  10. సిగ్నల్ జంపింగ్ - 78,438
  11. మైనర్ డ్రైవింగ్ - 10,336

ఇదీ చూడండి : ఎన్​ఆర్​ఐతో పెళ్లి విషయంలో మహిళలూ... జర భద్రం !!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.