ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 50 మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 7,072కి చేరింది. ఇప్పటివరకు వైరస్​తఒ మృతి చెందిన వారి సంఖ్య 203కు పెరిగింది.

author img

By

Published : Jun 21, 2020, 4:33 AM IST

546 new corona cases has reported in telangana on Saturday
రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్​ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు 7 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే 546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 6 నాటికి 3,496 కేసులు ఉండగా, శనివారం ఈ సంఖ్య 7,072కి చేరింది. కేవలం 14 రోజుల్లోనే పాజిటివ్‌ కేసులు రెండింతలు అయ్యాయి. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా పరీక్షలు పెరుగుతుండటంతో అదే స్థాయిలో కొత్తగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం 3,188 మంది నమూనాలు పరీక్షించారు. జీహెచ్‌ఎంసీలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 458 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 200 మార్కును దాటింది. శనివారం నాటికి 203 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని శనివారం 154 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,506కి చేరింది. మరో 3,363 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోఠిలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరికి పాజిటివ్‌ రావడంతో అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆ ఇద్దరు ఐపీఎస్‌లకు నెగిటివ్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు మలి విడత పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ ఇద్దరు అధికారులకు మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. తగిన జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకు వైరస్‌ బారినపడ్డామన్న అనుమానంతో వారిద్దరూ 24 గంటల వ్యవధిలో మరోసారి నమూనాలు ఇచ్చారు. శనివారం రాత్రి నెగిటివ్‌ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

546 new corona cases has reported in telangana on Saturday
రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్​ కేసులు

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

రాష్ట్రంలో కరోనా కేసులు 7 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే 546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 6 నాటికి 3,496 కేసులు ఉండగా, శనివారం ఈ సంఖ్య 7,072కి చేరింది. కేవలం 14 రోజుల్లోనే పాజిటివ్‌ కేసులు రెండింతలు అయ్యాయి. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా పరీక్షలు పెరుగుతుండటంతో అదే స్థాయిలో కొత్తగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం 3,188 మంది నమూనాలు పరీక్షించారు. జీహెచ్‌ఎంసీలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 458 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 200 మార్కును దాటింది. శనివారం నాటికి 203 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని శనివారం 154 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,506కి చేరింది. మరో 3,363 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోఠిలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరికి పాజిటివ్‌ రావడంతో అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆ ఇద్దరు ఐపీఎస్‌లకు నెగిటివ్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు మలి విడత పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ ఇద్దరు అధికారులకు మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. తగిన జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకు వైరస్‌ బారినపడ్డామన్న అనుమానంతో వారిద్దరూ 24 గంటల వ్యవధిలో మరోసారి నమూనాలు ఇచ్చారు. శనివారం రాత్రి నెగిటివ్‌ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

546 new corona cases has reported in telangana on Saturday
రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్​ కేసులు

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.