ETV Bharat / state

కోఠి ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి

రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్​ కింగ్​ కోఠి జిల్లా ఆసుపత్రిలో కొవిడ్​తో ఈరోజు నలుగురు బాధితులు మృతి చెందారు. అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Jul 23, 2020, 9:47 PM IST

4 corona deaths in king koti hospital
కోఠి ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి

హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి చెందారు. మేడిపల్లి, చిలకలగూడ, ముషీరాబాద్, హయత్​నగర్​కు చెందిన బాధితులు అనారోగ్యంతో కింగ్​కోఠిలోని ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది.

వీళ్లందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా... ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందారు. అలాగే అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఈ సర్కిల్​లో 1371 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో కరోనాతో నలుగురు మృతి చెందారు. మేడిపల్లి, చిలకలగూడ, ముషీరాబాద్, హయత్​నగర్​కు చెందిన బాధితులు అనారోగ్యంతో కింగ్​కోఠిలోని ఆసుపత్రిలో చేరారు. వీరికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది.

వీళ్లందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా... ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందారు. అలాగే అబిడ్స్ పరిధిలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఈ సర్కిల్​లో 1371 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.