రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. తాజాగా కొవిడ్తో ఇద్దరు మృతి చెందాగా.. మొత్తం మృతుల సంఖ్య 1,610కి పెరిగింది. వైరస్ నుంచి మరో 186 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,92,032కు చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 1,939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 808 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 25 కరోనా కేసులు రాగా... మిగిలిన కేసులు జిల్లాల్లో నమోదయ్యాయి.
ఇదీ చదవండి: నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్'పై స్పష్టత!