రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థపై చూపుతున్న వివక్షను వీడాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జేఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని యూనియన్ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. అలాగే వేతన సవరణ వెంటనే చేపట్టాలని, కార్మికులపై పని భారం తగ్గించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం