హైదరాబాద్ పాతబస్తీలో ఛార్మినర్ నుండి షాలీబండ వెళ్లే మార్గంలో ఓ పురాతన భవనం శిథిలావస్థలో ఉండి అటు ప్రయాణికులకు ఇటు రోడ్డు వెడల్పునకు ఇబ్బందిగా మారింది. ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేనీ ఆలం పోలీసుల సహకారంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా షాలీబండ కూడలి నుండి చార్మినార్ వెళ్లే మార్గాన్ని ట్రాఫిక్ సిబ్బంది తాత్కాలికంగా మూసివేసి ఇతర మార్గాల నుండి వాహనాలను దారి మళ్లించారు.
ఇవీ చూడండి: జరభద్రం: బాలుడికి ప్రమాదం... పెద్దలకు పాఠం