ETV Bharat / state

'మా గ్రామం నుంచి లారీ వెళ్లాలంటే నీరు చల్లాల్సిందే'

మణుగూరు ఓసీ గనికి వెళ్లే లారీల వల్ల దుమ్ము విపరీతంగా వస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజుపేట గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు.

author img

By

Published : Nov 2, 2019, 7:48 PM IST

మణుగూరులో లారీలను అడ్డుకున్న మహిళలు
మణుగూరులో లారీలను అడ్డుకున్న మహిళలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజుపేట గ్రామ మహిళలు బొగ్గు లారీలను అడ్డుకున్నారు. మణుగూరు ఓసీ గనికి వెళ్లే లారీల వల్ల విపరీతమైన దుమ్ము వస్తోందని వాపోయారు. లారీలు అతి వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వెళ్లే సమయంలో రహదారులపై నీరు చల్లాలని, లేనిపక్షంలో బొగ్గు లారీలు తమ గ్రామం నుంచి వెళ్లేందుకు అనుమతించమని హెచ్చరించారు.

మహిళల రాస్తారోకోతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు రహదారులపై బొగ్గు లారీలు వెళ్లేటప్పుడు నీరు చల్లుతామని హామీ ఇవ్వగా మహిళలు ఆందోళన విరమించారు.

మణుగూరులో లారీలను అడ్డుకున్న మహిళలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజుపేట గ్రామ మహిళలు బొగ్గు లారీలను అడ్డుకున్నారు. మణుగూరు ఓసీ గనికి వెళ్లే లారీల వల్ల విపరీతమైన దుమ్ము వస్తోందని వాపోయారు. లారీలు అతి వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వెళ్లే సమయంలో రహదారులపై నీరు చల్లాలని, లేనిపక్షంలో బొగ్గు లారీలు తమ గ్రామం నుంచి వెళ్లేందుకు అనుమతించమని హెచ్చరించారు.

మహిళల రాస్తారోకోతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు రహదారులపై బొగ్గు లారీలు వెళ్లేటప్పుడు నీరు చల్లుతామని హామీ ఇవ్వగా మహిళలు ఆందోళన విరమించారు.

Intro:బోగ్గు లారీలను అడ్డుకున్న మహిళలు


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలోని రాజుపేట గ్రామంలో మహిళలు బొగ్గు లారీలు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ..మణుగూరు ఓసి గని కి వెళ్లే లారీలు వల్ల దుమ్ము విపరీతంగా వస్తుందని పారిపోయారు. అంతేకాకుండా లారీలు అతి వేగంతో ప్రయాణిస్తూన్నాయని అన్నారు. రాహదారి పై నీటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామం నుంచి బొగ్గు లారీలు అనుమతించమని హెచ్చరించారు. మహిళల ఆందోళనతో రహదారికి రెండు వైపులా పదుల సంఖ్యలో లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.



Conclusion:విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు రోజుకు మూడు సార్లు రహదారిపై నీటిని చల్లిస్తామని హామీ ఇవ్వడంతో మహిళల ఆందోళన విరమించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.