భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదారమ్మకు రేపు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా హారతి ఇవ్వనున్నట్లు సమితి అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని నదులను పరిరక్షించాలని, నదులను పూజించడం వల్ల పుణ్యం కలుగుతుందని అన్నారు.
గత ఐదేళ్ల నుంచి గోదావరికి మహా హారతిని అందిస్తున్నట్లు తెలిపారు. కమిటీ అందించే కార్తీక దీపాలను నదిలో వదిలే కార్యక్రమం ఉంటుందని, సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవానికి సుమారు పదివేల మంది భక్తులు హాజరవనున్నారని తెలిపారు.
ఇదీ చూడండి : అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం