లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమయాల్లో ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం7 వరకు ప్రతిరోజు 144 సెక్షన్ అమలులో ఉంటదని... అతిక్రమిస్తే కఠినం చర్యలు తీసుకుంటామని అన్నారు. నిన్నటి నుంచి ఈరోజు వరకు సుమారు వంద ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రధాన రహదారిపైనే ఉంటూ... వైరస్ వ్వాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలపై కనపడ కూడదని ఆదేశించారు.
ఇదీ చూడండి: రూ.2కే కిలో గోధుమలు- ఒప్పంద ఉద్యోగులకు వేతనం