భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో రెండు రోజులుగా జోరువానలు కురుస్తున్నాయి. ఉపరితల గనిలోకి నీరు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా పనులు స్తంభించడంతో రోజుకి 12 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యేందుకు కనీసం మరో రోజు పట్టనుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : పొంగుతున్న వాగులు... నిలిచిపోయిన రాకపోకలు