ETV Bharat / state

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల - వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల

సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్​ పోటీలను స్థానిక నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు.

Tummala Nageswara Rao initiated volleyball competitions
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తుమ్మల
author img

By

Published : Apr 11, 2021, 4:37 PM IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహభావాన్ని పెంపొదిస్తాయని తెరాస నేత, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్​ పోటీలను స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహభావాన్ని పెంపొదిస్తాయని తెరాస నేత, రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతాయిగూడెంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి వాలీబాల్​ పోటీలను స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఏ రంగంలోనైనా గెలుపోటములు సహజమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రేపు వరంగల్​కు కేటీఆర్​.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.