ETV Bharat / state

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

author img

By

Published : Sep 1, 2020, 8:36 AM IST

Updated : Sep 1, 2020, 12:23 PM IST

భద్రాచలం వద్ద గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

godavari
godavari

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 22 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఇవాళ ఉదయం 6 గంటలకు 34.6 అడుగులకు పెరిగింది. 10 గంటలకు 36 అడుగులకు చేరింది.

నీటిమట్టం 43 అడుగుల వరకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎన్‌.వి రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి జాలర్లు, స్నానాలు చేసేవారు వెళ్లరాదని ఆదేశించారు. భద్రాచలం స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎవరు వెళ్లకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 22 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఇవాళ ఉదయం 6 గంటలకు 34.6 అడుగులకు పెరిగింది. 10 గంటలకు 36 అడుగులకు చేరింది.

నీటిమట్టం 43 అడుగుల వరకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎన్‌.వి రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి జాలర్లు, స్నానాలు చేసేవారు వెళ్లరాదని ఆదేశించారు. భద్రాచలం స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎవరు వెళ్లకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.

Last Updated : Sep 1, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.