ETV Bharat / state

'భద్రాచలం ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ వైద్యసిబ్బంది'

author img

By

Published : Aug 26, 2020, 1:46 PM IST

భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పీపీకిట్లు ధరించి పరిశీలించారు. బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 13 మంది వైద్యులే ఉన్నారని భట్టి తెలిపారు.

clp leader batti vikramarka visited badrachalam hopital
clp leader batti vikramarka visited badrachalam hopital

కరోనా విజృంభిస్తోన్న సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ మంది సిబ్బంది పని చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పీపీకిట్లు ధరించి పరిశీలించారు.

బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 13 మంది వైద్యులే ఉన్నారని భట్టి తెలిపారు. పట్టణంలో 400 మంది కరోనా బారిన పడ్డారని సుమారు 600 మంది హోంక్వారంటైన్​లో ఉంటున్నారని భట్టి వివరించారు. ప్రతీ ఆసుపత్రికి హోంక్వారంటైన్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సూపరింటిండెంట్​పై అధిక భారం పడిందన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలను వెంటనే పూర్తి చేసి... ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

కరోనా విజృంభిస్తోన్న సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ మంది సిబ్బంది పని చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ములుగు ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పీపీకిట్లు ధరించి పరిశీలించారు.

బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 13 మంది వైద్యులే ఉన్నారని భట్టి తెలిపారు. పట్టణంలో 400 మంది కరోనా బారిన పడ్డారని సుమారు 600 మంది హోంక్వారంటైన్​లో ఉంటున్నారని భట్టి వివరించారు. ప్రతీ ఆసుపత్రికి హోంక్వారంటైన్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సూపరింటిండెంట్​పై అధిక భారం పడిందన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలను వెంటనే పూర్తి చేసి... ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.