ETV Bharat / state

శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం - latest news on Bhadradri Rama appears in the incarnation of Sri Krishna

శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు భద్రాద్రి రామయ్య శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిచ్చారు.

Bhadradri Rama appears in the incarnation of Sri Krishna
శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు
author img

By

Published : Jan 4, 2020, 12:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 9వ రోజైన నేడు రామయ్య శ్రీకృష్ణుని అవతారంలో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.

రేపు సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 6వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు

ఇవీ చూడండి: పంచాయతీ కార్మికులకు తీపి కబురు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 9వ రోజైన నేడు రామయ్య శ్రీకృష్ణుని అవతారంలో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.

రేపు సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 6వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు

ఇవీ చూడండి: పంచాయతీ కార్మికులకు తీపి కబురు

Intro:శ్రీకృష్ణ


Body:అవతారం


Conclusion:భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో స్వామి వారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తొమ్మిదవ రోజైన నేడు రామయ్య తండ్రి శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రధాన ఆలయం నుంచి మేళతాళాల నడుమ బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారికి ఉంజల్ సేవ నిర్వహిస్తారు తదుపరి స్వామి వారు ప్రధానాలయం నుంచి మిథిలా ప్రాంగణంలో తిరువీధులలో విహరించనున్నారు రేపు సాయంత్రం స్వామివారికి గోదావరి నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తారు ఆరవ తేదీన ఉదయం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.