రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేస్తున్న తరుణంలో వీఆర్వోల నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని సరూర్నగర్, సైదాబాద్ తదితర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న వీఆర్వోలు భూ రికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. పాతబస్తీ బండ్లగూడా మండలంలోని ఆరుగురు వీఆర్వోలు... తమ వద్ద ఉన్న రికార్డులను తహసీల్దార్కు ఇచ్చేశారు. ఈ రికార్డులను తహసీల్దార్లు జిల్లా కలెక్టర్లకు పంపనున్నట్లు తెలిపారు.
తహసీల్దార్లకు భూరికార్డులు అందజేసిన వీఆర్వోలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని పలు ప్రాంతాల వీఆర్వోలు తమ వద్దనున్న భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను తహసీల్దార్లు వాటిని కలెక్టర్లకు అప్పగించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేస్తున్న తరుణంలో వీఆర్వోల నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని సరూర్నగర్, సైదాబాద్ తదితర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న వీఆర్వోలు భూ రికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. పాతబస్తీ బండ్లగూడా మండలంలోని ఆరుగురు వీఆర్వోలు... తమ వద్ద ఉన్న రికార్డులను తహసీల్దార్కు ఇచ్చేశారు. ఈ రికార్డులను తహసీల్దార్లు జిల్లా కలెక్టర్లకు పంపనున్నట్లు తెలిపారు.