ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలం కోలారి శివారులో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచామించ్చారు. అక్కడికి ఎఫ్డీవో బర్నోభా ఆధ్వర్యంలో బృందం వచ్చి పులి పాదముద్రాలను ఫొటోలు తీశారు. పెద్ద పులి వచ్చిన మాట వాస్తమేనని ఎఫ్డీవో బర్నోభా తెలిపారు. నీరు తాగేందుకు వచ్చి వెళ్లిపోయి ఉంటుందని చెప్పారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి