విద్యార్థినుల లైంగిక వేధింపుల వ్యవహారంలో బాసర త్రిబుల్ ఐటీ అధికారులు ఆదిలాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ జీవన్కుమార్ ఎదుట హాజరయ్యారు. ఇటీవల ఆ కళాశాలలో చోటుచేసుకున్న వ్యవరహారంపై న్యాయసేవాధికార సంస్థ సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర వివరాలతో తమ ఎదుట హాజరు కావాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శ్రీహరి శ్రీనివాస్, పీఆర్ఓ మధుసూదన్ హాజరయ్యారు. ఘటన తర్వాత తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని గట్టి చర్యలు తీసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టీస్ జీవన్ కుమార్ ఆధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి