ETV Bharat / state

పాఠాలు  నేర్వాలంటే... రైలు పట్టాలు దాటాల్సిందే - పాఠాలు  నేర్వాలంటే... రైలు పట్టాలు దాటాల్సిందే

ప్రమాదమని తెలిసినా బడికెళ్లాలంటే అడుగు ముందుకు వేయాల్సిందే...  బడికెళ్లే పిల్లలైనా... మార్కెట్‌కు వెళ్లాల్సిన పెద్దలైనా.. ఊరు దాటాలంటే ఒళ్లంతా కళ్లు చేసుకుని పట్టాలు దాటాల్సిందే..  గమ్యం చేరాకే ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. తలచుకుంటే క్షణాల్లో సమస్యను చక్కదిద్దే రైల్వే అధికారులకు వారి బాధలు కనబడడం లేదు. ఫలితంగా వేలాది మందికి ప్రాణగండంగా మారిన ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేలైన్‌పై  ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

పాఠాలు  నేర్వాలంటే... రైలు పట్టాలు దాటాల్సిందే
author img

By

Published : Sep 14, 2019, 12:39 AM IST

ఆ ఊళ్లలో పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలంతా టైమ్​టేబుల్​ కచ్చింతంగా పాటించాల్సిందే... గంట శబ్దాన్ని విన్న తరవాతే అడుగు వేయాల్సింది... ఇది సాధారణ విషయమే కదా అనుకుంటున్నారా! అందులోనే దాగుంది అసలు సమస్య. వారు పాటించేది పాఠశాల టైం టేబుల్​కాదు.. వినేది బడిగంట కాదు... రైల్వే టైం టేబుల్​.. రైలు కూత. ఆదిలాబాద్​ పట్టణం తిర్పెల్లి ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైలు పట్టాల ఇవతలి వైపు ఉంది. పట్టాల అవతల ఉన్న తాటిగూడ, క్రాంతినగర్​, భాగ్యనగర్​ మహలక్ష్మీవాడ, లక్ష్మీనగర్​ ప్రాంతాలకు చెందిన పిల్లలు బడికి రావాలంటే దినదినము గండంగా మారింది.

కాలనీలల్లో 25వేలకు పైచిలుకే జనాభా ఉంటుంది. దాదాపుగా అంతా పేదవాళ్లే. పట్టణశివారు ప్రాంతాలుగా ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయం అలా ఉంచితే రాకపోకలు సాగించడమే ప్రధాన సమస్యగా మారింది.

మార్కెట్‌ యార్డు సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా నేతల హామీలకే పరిమితమైంది. పైగా ఆదిలాబాద్‌ ప్రధాన మార్కెట్‌కు వచ్చివెళ్లడానికి... ఈ కాలనీలను ప్రధాన మార్కెట్‌కు అనుసంధానం చేయాడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. కేవలం ఎన్నికలవేళ ఓట్లు వేయడానికి పనికివస్తున్న ఇక్కడి ప్రజలు... రాకపోకలు సాగించడానికి కనీసం రైల్వే వంతెన నిర్మించాలనే డిమాండ్‌ నెరవేరడంలేదు.

పాఠాలు నేర్వాలంటే... రైలు పట్టాలు దాటాల్సిందే

ఇదీ చూడండి: 19 ఏళ్లలో ఆ పోలీస్​ స్టేషన్​కు వచ్చింది 2 కేసులే!

ఆ ఊళ్లలో పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలంతా టైమ్​టేబుల్​ కచ్చింతంగా పాటించాల్సిందే... గంట శబ్దాన్ని విన్న తరవాతే అడుగు వేయాల్సింది... ఇది సాధారణ విషయమే కదా అనుకుంటున్నారా! అందులోనే దాగుంది అసలు సమస్య. వారు పాటించేది పాఠశాల టైం టేబుల్​కాదు.. వినేది బడిగంట కాదు... రైల్వే టైం టేబుల్​.. రైలు కూత. ఆదిలాబాద్​ పట్టణం తిర్పెల్లి ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైలు పట్టాల ఇవతలి వైపు ఉంది. పట్టాల అవతల ఉన్న తాటిగూడ, క్రాంతినగర్​, భాగ్యనగర్​ మహలక్ష్మీవాడ, లక్ష్మీనగర్​ ప్రాంతాలకు చెందిన పిల్లలు బడికి రావాలంటే దినదినము గండంగా మారింది.

కాలనీలల్లో 25వేలకు పైచిలుకే జనాభా ఉంటుంది. దాదాపుగా అంతా పేదవాళ్లే. పట్టణశివారు ప్రాంతాలుగా ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయం అలా ఉంచితే రాకపోకలు సాగించడమే ప్రధాన సమస్యగా మారింది.

మార్కెట్‌ యార్డు సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కూడా నేతల హామీలకే పరిమితమైంది. పైగా ఆదిలాబాద్‌ ప్రధాన మార్కెట్‌కు వచ్చివెళ్లడానికి... ఈ కాలనీలను ప్రధాన మార్కెట్‌కు అనుసంధానం చేయాడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. కేవలం ఎన్నికలవేళ ఓట్లు వేయడానికి పనికివస్తున్న ఇక్కడి ప్రజలు... రాకపోకలు సాగించడానికి కనీసం రైల్వే వంతెన నిర్మించాలనే డిమాండ్‌ నెరవేరడంలేదు.

పాఠాలు నేర్వాలంటే... రైలు పట్టాలు దాటాల్సిందే

ఇదీ చూడండి: 19 ఏళ్లలో ఆ పోలీస్​ స్టేషన్​కు వచ్చింది 2 కేసులే!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.