ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారుగూడ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ ప్రమాదంలో అదే మండలానికి చెందిన మత్తడిగూడ గ్రామవాసి భీమ్రావు అక్కడిక్కడే మృతి చెందాడు. నిలిచి ఉన్న ట్రాక్టర్ ఆటో వస్తున్న వైపు కదలడం ఈ ప్రమాదానికి కారణమైంది. ట్రాక్టర్ని ఢీకొట్టిన ఆటో.. అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ పక్కన ప్రయాణిస్తున్న భీమ్రావ్పైనే ఆటో పడి అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం కావడం వల్ల సదరు ట్రాక్టర్ డ్రైవర్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!