ఆదిలాబాద్లో పోలీసు బందోబస్తు నడుమ మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు తెరవగా.. అంతకుముందే బారులు తీరారు. ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఉదయం నుంచే వైన్ షాపుల ముందు మందు కోసం ప్రజలు బారులు తీరారు. నిర్మల్ జిల్లా ముథోల్లో వైన్షాప్స్ ముందు మందు కోసం ఖాళీ బాటిళ్లు క్యూ లైన్లో పెట్టి ఉదయం నుంచి ఎదురుచూశారు. ఒకరికి 4 బాటిళ్లు మాత్రమే ఇచ్చేలా ఆబ్కారీ అధికారులు నిబంధన పెట్టారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 26 మద్యం దుకాణాల ముందు ఉదయం నుంచే బారీ ఎత్తున బారులు తీరారు. యజమానులు పూజలు నిర్వహించి దుకాణాలు ప్రారంభించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారుల బందోబస్తు మధ్య... మాస్క్ ధరించినవారికే మద్యం విక్రయించారు. మంచిర్యాల జిల్లాలోనూ... దుకాణాలు తెరవకముందే క్యూ కట్టారు. దుకాణాల ముందు ముగ్గుతో సర్కిల్స్ ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు