ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా.. ఇళ్లలో నిల్వ చేసిన 750 పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. మొత్తం 5.50 లక్షల విలువైన 360కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు. నిందితులను షేక్ మెహరాజ్, మహ్మద్ ముస్తాపాలను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇటీవల మధ్యప్రదేశ్కు చెందిన కాలుసింగ్ అనే వ్యక్తి నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించమన్నారు. రైతులు తక్కువ ధరకు విత్తనాలు అమ్మే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామన్నారు.