ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న అంగన్వాడీ కేంద్రాలను ఎత్తి వేయొద్దని డిమాండ్ చేశారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న అంగన్వాడీ కేంద్రాలను ఎత్తివేయడం తోపాటు చిన్నారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలు విలీనం చేయడం భావ్యం కాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 20, 21 తేదీలలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మకుటాయమానం'