కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకోవడం హర్షణీయమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ పేర్కొన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని చర్చిలో లేత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 నిరుపేద కుటుంబాలకు... బియ్యంతో పాటు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన కిట్టును అందించారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. పేదలకు సహాయం చేయడం సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. కరోనా కాలంలో కులమత బేధాలు లేకుండా స్వచ్ఛంద సంస్థలు పేద కుటుంబాలను ఆదుకున్నాయని తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను జడ్పీ చైర్మన్ ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి: డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్