ETV Bharat / sports

కరోనా కట్టడి కోసం ఫెదరర్‌ రూ.7.75 కోట్ల విరాళం - Federar news

కరోనాపై ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్​డౌన్​లో ఉన్నాయి. ఫలితంగా ఆర్థిక కార్యాకలాపాలు ఎక్కడిక్కడ ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. స్విస్​ టెన్నిస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​ రూ.7.75 కోట్లు విరాళమివ్వగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ రూ. 50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పాడు.

Federer
ఫెదరర్‌ విరాళం రూ.7.75 కోట్లు
author img

By

Published : Mar 26, 2020, 9:55 AM IST

కరోనా వైరస్‌పై పోరాటం కోసం స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రూ.7.75 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ 8,800 మంది కరోనా బారిన పడగా, 86 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుండగా.. ఫెదరర్‌ ఈ జాబితాలో చేరాడు. మరోవైపు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్‌.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి అప్పగించారు.

దాదా రూ.50 లక్షల బియ్యం

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కోల్‌కతాలో ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలకు సాయం చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ముందుకొచ్చాడు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పాడు.

ఇదీ చదవండి: భార్యకు భయపడి టాయ్​లెట్​ శుభ్రం చేస్తున్న ధావన్!

కరోనా వైరస్‌పై పోరాటం కోసం స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ రూ.7.75 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ 8,800 మంది కరోనా బారిన పడగా, 86 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుండగా.. ఫెదరర్‌ ఈ జాబితాలో చేరాడు. మరోవైపు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్‌.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి అప్పగించారు.

దాదా రూ.50 లక్షల బియ్యం

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కోల్‌కతాలో ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలకు సాయం చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ముందుకొచ్చాడు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పాడు.

ఇదీ చదవండి: భార్యకు భయపడి టాయ్​లెట్​ శుభ్రం చేస్తున్న ధావన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.