ETV Bharat / sports

జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

author img

By

Published : May 20, 2021, 9:51 PM IST

Updated : May 20, 2021, 10:49 PM IST

కరోనా సంక్షోభంలో ఈ ఏడాది కూడా జాతీయ క్రీడా పురస్కారాల నామినేషన్ల దరఖాస్తులను ఆన్​లైన్​లో స్వీకరించనున్నట్లు క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. గతేడాది లాగే ఈ సారీ స్వీయ నామినేట్​ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Sports Ministry invites applications for National Sports Awards
జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిఏటా జరిగే అత్యున్నత క్రీడా పురస్కారాల నామినేషన్ల దరఖాస్తులను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. గతేడాది లాగే ఈ సారీ ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాదీ కూడా స్వీయ నామినేషన్​ ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నట్లు క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

"కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్​లైన్​లోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతేడాది తొలిసారిగా స్వీయ నామినేషన్లకు అవకాశాన్ని కల్పించాం. అలాగే ఈ ఏడాదీ స్వయంగా నామినేట్​ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాం. జాతీయ క్రీడా సమాఖ్యలూ క్రీడాకారులను ఈ పురస్కారాలకు నామినేట్​ చేయోచ్చు".

- క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటన

సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. అయితే ఈసారి దరఖాస్తు సమర్పించేందుకు జూన్​ 21 చివరితేదీగా క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. గతేడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం 74 మందిని ఎంపికచేశారు.

రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు రూ.15 లక్షలు, ద్రోణాచార్య (జీవితకాలం) పురస్కారానికి రూ.15 లక్షలు, ధ్యాన్​చంద్​ అవార్డు విజేతలకు రూ.10 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.

ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ జయంతి సందర్బంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు, కోచ్​లకు ఈ పురస్కారాల్నికేంద్రం అందజేయనుంది.

ఇదీ చూడండి.. వచ్చే ఆసియాకప్ పాక్​లో.. టీమ్​ఇండియా వెళ్తుందా?

ప్రతిఏటా జరిగే అత్యున్నత క్రీడా పురస్కారాల నామినేషన్ల దరఖాస్తులను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. గతేడాది లాగే ఈ సారీ ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాదీ కూడా స్వీయ నామినేషన్​ ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నట్లు క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

"కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్​లైన్​లోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతేడాది తొలిసారిగా స్వీయ నామినేషన్లకు అవకాశాన్ని కల్పించాం. అలాగే ఈ ఏడాదీ స్వయంగా నామినేట్​ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాం. జాతీయ క్రీడా సమాఖ్యలూ క్రీడాకారులను ఈ పురస్కారాలకు నామినేట్​ చేయోచ్చు".

- క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటన

సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. అయితే ఈసారి దరఖాస్తు సమర్పించేందుకు జూన్​ 21 చివరితేదీగా క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. గతేడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం 74 మందిని ఎంపికచేశారు.

రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు రూ.15 లక్షలు, ద్రోణాచార్య (జీవితకాలం) పురస్కారానికి రూ.15 లక్షలు, ధ్యాన్​చంద్​ అవార్డు విజేతలకు రూ.10 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.

ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ జయంతి సందర్బంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు, కోచ్​లకు ఈ పురస్కారాల్నికేంద్రం అందజేయనుంది.

ఇదీ చూడండి.. వచ్చే ఆసియాకప్ పాక్​లో.. టీమ్​ఇండియా వెళ్తుందా?

Last Updated : May 20, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.