ETV Bharat / sports

ప్రపంచకప్: మరో ఇద్దరు భారత షూటర్లకు కరోనా

author img

By

Published : Mar 21, 2021, 11:57 AM IST

షూటింగ్ ప్రపంచకప్​లో ఓ వైపు పోటీలు జరుగుతుండగా, మరోవైపు కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మనదేశానికి చెందిన నలుగురు షూటర్లు కరోనా బారిన పడ్డారు.

Shooting World Cup: Two more Indian shooters test positive
ప్రపంచకప్: మరో ఇద్దరు భారత షూటర్లకు కరోనా

దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు షూటర్లకు వైరస్​ సోకినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్​ ప్రతినిధి తెలిపారు. వారు 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగానికి చెందిన వారు.

అంతకు ముందు శనివారం చేసిన పరీక్షల్లో ఇద్దరు భారత షూటర్లతో పాటు ఓ అంతర్జాతీయ షూటర్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

పోటీల మొదలైన రెండోరోజు యశస్విని సింగ్ దీస్వాల్.. మహిళల 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్ విభాగంలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మను బాకర్ రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ శర్మ.. వరుసగా వెండి, కంచు పతకాలు కైవసం చేసుకున్నారు.

దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు షూటర్లకు వైరస్​ సోకినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్​ ప్రతినిధి తెలిపారు. వారు 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగానికి చెందిన వారు.

అంతకు ముందు శనివారం చేసిన పరీక్షల్లో ఇద్దరు భారత షూటర్లతో పాటు ఓ అంతర్జాతీయ షూటర్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

పోటీల మొదలైన రెండోరోజు యశస్విని సింగ్ దీస్వాల్.. మహిళల 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్ విభాగంలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మను బాకర్ రజతం గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ శర్మ.. వరుసగా వెండి, కంచు పతకాలు కైవసం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.