ETV Bharat / sports

కరోనాతో మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్​ మృతి

భారత మహిళల వాలీబాల్​ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్​ కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

author img

By

Published : Jun 13, 2021, 10:01 PM IST

nirmala kaur, milkha singh
మిల్కా సింగ్, నిర్మలా కౌర్

భారత దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్​ మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్​.. కన్నుమూశారు. కొవిడ్ సంబంధ సమస్యలతో ఆమె గత నెల 26న మొహాలీలోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో చేరారు. ఆమె భర్త మిల్కా సింగ్ ద్వారానే నిర్మలా కౌర్​కు మహమ్మారి సోకింది.

తొలుత కరోనా బారిన పడిన మిల్కా సింగ్​ కూడా ఈ ఫోర్టిస్​ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం అక్కడి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. మళ్లీ ఆయన పరిస్థితి సీరియస్​గా ఉండడం వల్ల చండీగఢ్​​లోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మిల్కా సింగ్ ఐసీయూలోనే ఉన్నారు.

భారత దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్​ మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్​.. కన్నుమూశారు. కొవిడ్ సంబంధ సమస్యలతో ఆమె గత నెల 26న మొహాలీలోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో చేరారు. ఆమె భర్త మిల్కా సింగ్ ద్వారానే నిర్మలా కౌర్​కు మహమ్మారి సోకింది.

తొలుత కరోనా బారిన పడిన మిల్కా సింగ్​ కూడా ఈ ఫోర్టిస్​ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అనంతరం అక్కడి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. మళ్లీ ఆయన పరిస్థితి సీరియస్​గా ఉండడం వల్ల చండీగఢ్​​లోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మిల్కా సింగ్ ఐసీయూలోనే ఉన్నారు.

ఇదీ చదవండి: ICC Hall of Fame: వినూ మన్కడ్​కు అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.