ETV Bharat / sports

ఒలింపిక్స్​కు ముందు భారత బాక్సర్ల తుది సమరం

author img

By

Published : May 24, 2021, 6:29 AM IST

ఒలింపిక్స్​కు ముందు బాక్సర్లు తమను తాము పరీక్షించుకునేందుకు ఉన్న ఏకైక వేదిక ఏషియన్​ ఛాంపియన్​షిప్స్. భారత్​లో జరగాల్సిన ఈ పోటీలు కొవిడ్ కారణంగా దుబాయ్​కు తరలిపోయాయి. గత సీజన్లలో ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బృందం ఈ సారి కూడా మెరుగ్గా రాణించాలని కోరుకుంటోంది. ఈ పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

meri kom, indian boxer
మేరీ కోమ్, భారత ప్రముఖ బాక్సర్

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు ముందు బాక్సర్లు ఆడనున్న చివరి టోర్నీ ఏషియన్ ఛాంపియన్​షిప్స్​. దుబాయ్ వేదికగా సోమవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 27 దేశాలు ఇందులో పాల్గొంటాయని భావించినప్పటికీ.. కొవిడ్​తో పాటు అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల కారణంగా ఆ సంఖ్య 17కే పరిమితమైంది.

భారత్​ తరఫున మొత్తం 19 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పది మంది మహిళా బాక్సర్లు కాగా.. మిగిలిన వారు పురుషులు. మొత్తంగా 10 కేటగిరీల్లో 47 మంది మహిళా బాక్సర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మహిళా బాక్సర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సారి ఏడు పతకాలు కైవసం చేసుకుంటామని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

థాయిలాండ్​ వేదికగా 2019లో జరిగిన ఏషియన్​ ఛాంపియన్​షిప్స్​లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్​.. ఈసారి కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటోంది. గతంలో రెండు స్వర్ణాలు​, నాలుగు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో మొత్తం 13 మెడల్స్​ను ఖాతాలో వేసుకున్నారు మన బాక్సర్లు. కరోనా కారణంగా ఇప్పటికే పలు పోటీలు రద్దు అయ్యాయి. దీంతో ఒలింపిక్స్​కు ముందు ఈ టోర్నీ కీలకంగా మారింది.

ఇదీ చదవండి: ర్యాన్ 'చిరిగిన బూట్ల'కు స్పాన్సర్ దొరికేశారు

డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగాల్​(52 కేజీ) సహా ఆరుగురు బాక్సర్లు ఇప్పటికే తొలి రౌండ్​లో బై సాధించారు. వీరితో పాటు గత సీజన్ పతక విజేత ఆశీష్ కుమార్(75 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ).. కూడా ఈ సారి టోర్నీల్లో ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. గత నాలుగు సీజన్లలో వరుసగా నాలుగు పతకాలు సాధించిన శివ తాపా(64 కేజీ) కూడా పతక ఆశావాహుల్లో ఒకడు. సౌత్​ ఏషియన్​ గేమ్స్​ బంగారు పతక విజేత వినోద్ తన్వార్(49 కేజీ).. కొవిడ్ కారణంగా ఈ పోటీలకు దూరమయ్యాడు.

ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ మేరీ కోమ్​.. ఈ పోటీల్లో గతంలో ఐదు సార్లు బంగారు పతకాలు గెలుపొందింది. ఆమెతో పాటు సిమ్రన్​ జీత్ కౌర్(60 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), డిఫెండింగ్ ఛాంపియన్​ పూజా రాణి(75 కేజీ).. ఈ పోటీల్లో పతకాన్ని ఆశించే వారిలో ఉన్నారు. ఈ నలుగురూ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ఈ సారి ప్రైజ్​ ఫండ్ మొత్తాన్ని రూ.2.91 కోట్లకు పెంచారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్​ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్​ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ పోటీలను కొవిడ్ కారణంగా దుబాయ్​కు తరలించారు. ఇందులో పసిడి పతకం సాధించిన వారికి రూ.7.29 లక్షలు, రజత పతక విజేతలకు రూ.3.64 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.1.82 లక్షలు ప్రైజ్​మనీగా ఇవ్వనున్నారు.

భారత స్క్వాడ్స్​..

పురుషులు:

అమిత్ పంగాల్(52 కేజీ), మహమ్మద్​ హుసాముద్దీన్(56 కేజీ), వరిందర్ సింగ్(60 కేజీ), శివ తాపా(64 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ), ఆశీష్ కుమార్(75 కేజీ), సుమిత్ సంగ్వాన్(81 కేజీ), సంజీత్(91 కేజీ), నరేందర్(91+ కేజీ).

మహిళలు:

మోనికా(48 కేజీ), మేరీ కోమ్(51 కేజీ), సాక్షి(54 కేజీ), జాస్మిన్(57 కేజీ), సిమ్రన్​జీత్ కౌర్(60 కేజీ), లాల్బూటా సాయిహి (64 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), పూజా రాణి(75 కేజీ), సావితీ(81 కేజీ), అనుపమ(81+ కేజీ).

ఇదీ చదవండి: త్వరలోనే వారికి ప్రపంచకప్ ప్రైజ్​మనీ

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు ముందు బాక్సర్లు ఆడనున్న చివరి టోర్నీ ఏషియన్ ఛాంపియన్​షిప్స్​. దుబాయ్ వేదికగా సోమవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 27 దేశాలు ఇందులో పాల్గొంటాయని భావించినప్పటికీ.. కొవిడ్​తో పాటు అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల కారణంగా ఆ సంఖ్య 17కే పరిమితమైంది.

భారత్​ తరఫున మొత్తం 19 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పది మంది మహిళా బాక్సర్లు కాగా.. మిగిలిన వారు పురుషులు. మొత్తంగా 10 కేటగిరీల్లో 47 మంది మహిళా బాక్సర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మహిళా బాక్సర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సారి ఏడు పతకాలు కైవసం చేసుకుంటామని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

థాయిలాండ్​ వేదికగా 2019లో జరిగిన ఏషియన్​ ఛాంపియన్​షిప్స్​లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్​.. ఈసారి కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటోంది. గతంలో రెండు స్వర్ణాలు​, నాలుగు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో మొత్తం 13 మెడల్స్​ను ఖాతాలో వేసుకున్నారు మన బాక్సర్లు. కరోనా కారణంగా ఇప్పటికే పలు పోటీలు రద్దు అయ్యాయి. దీంతో ఒలింపిక్స్​కు ముందు ఈ టోర్నీ కీలకంగా మారింది.

ఇదీ చదవండి: ర్యాన్ 'చిరిగిన బూట్ల'కు స్పాన్సర్ దొరికేశారు

డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగాల్​(52 కేజీ) సహా ఆరుగురు బాక్సర్లు ఇప్పటికే తొలి రౌండ్​లో బై సాధించారు. వీరితో పాటు గత సీజన్ పతక విజేత ఆశీష్ కుమార్(75 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ).. కూడా ఈ సారి టోర్నీల్లో ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. గత నాలుగు సీజన్లలో వరుసగా నాలుగు పతకాలు సాధించిన శివ తాపా(64 కేజీ) కూడా పతక ఆశావాహుల్లో ఒకడు. సౌత్​ ఏషియన్​ గేమ్స్​ బంగారు పతక విజేత వినోద్ తన్వార్(49 కేజీ).. కొవిడ్ కారణంగా ఈ పోటీలకు దూరమయ్యాడు.

ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ మేరీ కోమ్​.. ఈ పోటీల్లో గతంలో ఐదు సార్లు బంగారు పతకాలు గెలుపొందింది. ఆమెతో పాటు సిమ్రన్​ జీత్ కౌర్(60 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), డిఫెండింగ్ ఛాంపియన్​ పూజా రాణి(75 కేజీ).. ఈ పోటీల్లో పతకాన్ని ఆశించే వారిలో ఉన్నారు. ఈ నలుగురూ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ఈ సారి ప్రైజ్​ ఫండ్ మొత్తాన్ని రూ.2.91 కోట్లకు పెంచారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్​ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్​ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ పోటీలను కొవిడ్ కారణంగా దుబాయ్​కు తరలించారు. ఇందులో పసిడి పతకం సాధించిన వారికి రూ.7.29 లక్షలు, రజత పతక విజేతలకు రూ.3.64 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.1.82 లక్షలు ప్రైజ్​మనీగా ఇవ్వనున్నారు.

భారత స్క్వాడ్స్​..

పురుషులు:

అమిత్ పంగాల్(52 కేజీ), మహమ్మద్​ హుసాముద్దీన్(56 కేజీ), వరిందర్ సింగ్(60 కేజీ), శివ తాపా(64 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ), ఆశీష్ కుమార్(75 కేజీ), సుమిత్ సంగ్వాన్(81 కేజీ), సంజీత్(91 కేజీ), నరేందర్(91+ కేజీ).

మహిళలు:

మోనికా(48 కేజీ), మేరీ కోమ్(51 కేజీ), సాక్షి(54 కేజీ), జాస్మిన్(57 కేజీ), సిమ్రన్​జీత్ కౌర్(60 కేజీ), లాల్బూటా సాయిహి (64 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), పూజా రాణి(75 కేజీ), సావితీ(81 కేజీ), అనుపమ(81+ కేజీ).

ఇదీ చదవండి: త్వరలోనే వారికి ప్రపంచకప్ ప్రైజ్​మనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.