ETV Bharat / sports

రూ.485 కోట్లతో ఒలింపిక్స్​ కోసం యాప్​ రూపొందిస్తే..!

author img

By

Published : Mar 24, 2021, 6:42 AM IST

టోక్యో ఒలింపిక్స్ కోసం రూపొందించిన కరోనా యాప్​.. ఇప్పుడు నిరుపయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ అభిమానులపై నిషేధం పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ ఏమైంది?

A Buggy Contact-Tracing App
ఒలింపిక్స్

సాంకేతిక పరిజ్ఞానం అంటే గుర్తొచ్చే పేరు జపాన్.. ఆ పేరుకు తగ్గట్లే జులై 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్​కు సిద్ధమైంది. ఆ క్రమంలోనే కరోనా వైరస్ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసింది. స్టేడియంలో ఉండే అభిమానుల్లో ఎవరికైనా ఈ మహమ్మారి ఉంటే వెంటనే నిర్వహకులకు సమాచారం అందుతుంది. అయితే కరోనా కారణంగా తాజాగా విదేశీ అభిమానులపై నిషేధం పడటం వల్ల ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఈ యాప్ నిరుపయోగంగా మారనుందని జపాన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

Tokyo Olympics
ఒలింపిక్స్ పోటీలు(పాత ఫొటో)

జపాన్ లోనే అతి పెద్ద టెలికాం సంస్థ ఎన్టీటీ కమ్మునికేషన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ ఎన్టీటీ మొబైల్ ట్రాకింగ్ సాఫ్ట్​వేర్ యాప్ కోసం జపాన్ ఒలింపిక్ కమిటీ దాదాపు రూ. 485 కోట్లు ఖర్చు పెట్టిందట. మొదట్లో జపాన్ దేశంలో కరోనాను కనిపెట్టడానికి రూపొందించిన కొకా యాప్(కొవిడ్-19 కాంటాక్ట్ కన్​ఫార్మింగ్ యాప్) వ్యయం కంటే దీనికైన ఖర్చు ఇరవైరెట్లు ఎక్కువట.

భిన్నమైన భాషలతో కూడిన ఈ యాప్ జూన్​లో విడుదల కావాల్సి ఉంది. ఈ యాప్​ను అభిమానులు డౌన్​లోడ్ చేసుకుంటే వారి వివరాలను శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షించే వీలుంటుందని ఒలింపిక్ సంఘం చెబుతోంది. టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ మొదట అనుకున్న వ్యయం రూ.లక్షా 10 వేల కోట్లు కాగా.. తాజాగా ఈ ఖర్చు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగిందని అంచనా.

సాంకేతిక పరిజ్ఞానం అంటే గుర్తొచ్చే పేరు జపాన్.. ఆ పేరుకు తగ్గట్లే జులై 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్​కు సిద్ధమైంది. ఆ క్రమంలోనే కరోనా వైరస్ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసింది. స్టేడియంలో ఉండే అభిమానుల్లో ఎవరికైనా ఈ మహమ్మారి ఉంటే వెంటనే నిర్వహకులకు సమాచారం అందుతుంది. అయితే కరోనా కారణంగా తాజాగా విదేశీ అభిమానులపై నిషేధం పడటం వల్ల ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఈ యాప్ నిరుపయోగంగా మారనుందని జపాన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

Tokyo Olympics
ఒలింపిక్స్ పోటీలు(పాత ఫొటో)

జపాన్ లోనే అతి పెద్ద టెలికాం సంస్థ ఎన్టీటీ కమ్మునికేషన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ ఎన్టీటీ మొబైల్ ట్రాకింగ్ సాఫ్ట్​వేర్ యాప్ కోసం జపాన్ ఒలింపిక్ కమిటీ దాదాపు రూ. 485 కోట్లు ఖర్చు పెట్టిందట. మొదట్లో జపాన్ దేశంలో కరోనాను కనిపెట్టడానికి రూపొందించిన కొకా యాప్(కొవిడ్-19 కాంటాక్ట్ కన్​ఫార్మింగ్ యాప్) వ్యయం కంటే దీనికైన ఖర్చు ఇరవైరెట్లు ఎక్కువట.

భిన్నమైన భాషలతో కూడిన ఈ యాప్ జూన్​లో విడుదల కావాల్సి ఉంది. ఈ యాప్​ను అభిమానులు డౌన్​లోడ్ చేసుకుంటే వారి వివరాలను శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షించే వీలుంటుందని ఒలింపిక్ సంఘం చెబుతోంది. టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ మొదట అనుకున్న వ్యయం రూ.లక్షా 10 వేల కోట్లు కాగా.. తాజాగా ఈ ఖర్చు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగిందని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.