ETV Bharat / sports

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్​దీప్​ సింగ్​

author img

By

Published : Aug 11, 2020, 11:25 AM IST

Updated : Aug 11, 2020, 2:33 PM IST

కరోనా బారిన పడిన భారత పురుషుల హాకీ జట్టు ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లకు వైరస్​ సోకగా.. తాజాగా ఫార్వర్డ్​ క్రీడాకారుడు మన్​దీప్​ సింగ్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఆక్సిజన్​ స్థాయిలు తగ్గడం వల్ల అతడిని బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు.

mandeep
హాకీ క్రీడాకారుడు మన్​దీప్​ను ఆసుపత్రికి తరలింపు

కరోనా దెబ్బకు భారత పురుషుల హాకీ జట్టు కుదేలైంది. ఇప్పటికే కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు వైరస్​ సోకగా.. తాజాగా ఫార్వర్డ్​ క్రీడాకారుడు మన్​దీప్​ సింగ్​కు పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు ప్రకటించింది భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్​).

ఆక్సిజన్​ తగ్గడంతో ఆసుపత్రిలో...

నెల రోజుల విరామం తర్వాత తిరిగి జాతీయ శిక్షణ శిబిరం కోసం బెంగళూరులోని సాయ్​ కేంద్రానికి వచ్చిన హాకీ ఆటగాళ్లందరికీ వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఆ శిబిరం ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షల్లో మన్​దీప్​నకు పాజిటివ్​గా నిర్దరణ అయింది.​ తొలుత వైరస్​ లక్షణాలు లేకపోవడం మిగతా అయిదుగురు ఆటగాళ్లతో పాటు అతనికీ తమ ప్రాంగణంలోనే చికిత్స అందిస్తున్నట్లు సాయ్ తెలిపింది.

అయితే తర్వాత ఈ ఫార్వర్డ్​ ప్లేయర్​కు ఆక్సిజన్​ స్థాయిలు తగ్గడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వివిధ ప్రదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన ఆటగాళ్లు.. ప్రయాణం సమయంలోనే వైరస్ ఉన్న వ్యక్తుల​తో కాంటాక్ట్​ అయి ఉంటారని సాయ్​ అధికారులు భావిస్తున్నారు.

భారత్​ తరఫున 129 గేమ్​లు ఆడిన మన్​దీప్​.. 60 గోల్స్​ సాధించాడు. 2018 ఆసియా​ ఛాంపియన్స్​ ట్రోఫీలో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడు. ఇతడితో పాటు మన్​ప్రీత్​ సింగ్, సురేందర్​, జస్కరన్​, వరుణ్​ కుమార్​, కృష్ణన్​ వైరస్​ బారిన పడ్డారు.

కరోనా దెబ్బకు భారత పురుషుల హాకీ జట్టు కుదేలైంది. ఇప్పటికే కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​తో పాటు మరో నలుగురు ఆటగాళ్లకు వైరస్​ సోకగా.. తాజాగా ఫార్వర్డ్​ క్రీడాకారుడు మన్​దీప్​ సింగ్​కు పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు ప్రకటించింది భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్​).

ఆక్సిజన్​ తగ్గడంతో ఆసుపత్రిలో...

నెల రోజుల విరామం తర్వాత తిరిగి జాతీయ శిక్షణ శిబిరం కోసం బెంగళూరులోని సాయ్​ కేంద్రానికి వచ్చిన హాకీ ఆటగాళ్లందరికీ వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ఆ శిబిరం ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షల్లో మన్​దీప్​నకు పాజిటివ్​గా నిర్దరణ అయింది.​ తొలుత వైరస్​ లక్షణాలు లేకపోవడం మిగతా అయిదుగురు ఆటగాళ్లతో పాటు అతనికీ తమ ప్రాంగణంలోనే చికిత్స అందిస్తున్నట్లు సాయ్ తెలిపింది.

అయితే తర్వాత ఈ ఫార్వర్డ్​ ప్లేయర్​కు ఆక్సిజన్​ స్థాయిలు తగ్గడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వివిధ ప్రదేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన ఆటగాళ్లు.. ప్రయాణం సమయంలోనే వైరస్ ఉన్న వ్యక్తుల​తో కాంటాక్ట్​ అయి ఉంటారని సాయ్​ అధికారులు భావిస్తున్నారు.

భారత్​ తరఫున 129 గేమ్​లు ఆడిన మన్​దీప్​.. 60 గోల్స్​ సాధించాడు. 2018 ఆసియా​ ఛాంపియన్స్​ ట్రోఫీలో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడు. ఇతడితో పాటు మన్​ప్రీత్​ సింగ్, సురేందర్​, జస్కరన్​, వరుణ్​ కుమార్​, కృష్ణన్​ వైరస్​ బారిన పడ్డారు.

Last Updated : Aug 11, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.