ETV Bharat / sports

సూర్యకుమార్​ మంచి మనసు.. గ్రౌండ్స్​మెన్ కోసం!

author img

By

Published : Dec 28, 2021, 2:11 PM IST

Surya Kumar Yadav Donation: టీమ్​ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. ఓ లోకల్​ టోర్నమెంట్​లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అత్యధిక పరుగులు చేసి 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్' సొంతం చేసుకున్నాడు. అనంతరం ఈ అవార్డును గ్రౌండ్స్​మెన్​కు డొనేట్ చేశాడు.

surya kumar yadav
సూర్యకుమార్ యాదవ్

Surya Kumar Yadav Donation: టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ లోకల్​ టోర్నమెంట్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. పర్సీ జిమ్​ఖానా, పయ్యాడే స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్​లో 152 బంతుల్లో 259 పరుగులు చేశాడు. అనంతరం 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు'ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ఈ అవార్డును మైదానంలోని గ్రౌండ్స్​మెన్​కు కానుకగా ఇచ్చి అందరి మనసను గెలుచుకున్నాడు.

"పిచ్​ను తయారు చేయడం కోసం గ్రౌండ్స్​మెన్ ఎంతో శ్రమిస్తారు. అందరికన్నా ముందు వారే గ్రౌండ్​కు వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. ఇంతచేసినా వారికి సరైన గుర్తింపు ఉండదు. ఆరంభంలో క్రికెట్ ఆడటానికి ముందు నేను కూడా గ్రౌండ్స్​​మెన్​తో కలిసి పిచ్​ను రోల్​ చేసేందుకు వెళ్లేవాడిని."

-సూర్యకుమార్ యాదవ్, టీమ్​ఇండియా ఆటగాడు.

చాలా మంది క్రికెటర్లు.. గ్రౌండ్స్​మెన్​ పనితీరును మర్చిపోతారని సూర్యకుమార్​ అభిప్రాయపడ్డాడు. కానీ, వారితో తనకున్న అనుబంధం అందరిలా కాదని చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు తప్పనిసరిగా గ్రౌండ్స్​మెన్​ చేసే పనిని గుర్తుపెట్టుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

suryakumar yadav
సూర్య కుమార్ యాదవ్

'ఓ క్రికెటర్​ గొప్పగా ఆడితే అందరూ అతడినే ప్రశంసిస్తారు. తర్వాత రోజు అతడిని పొగుడుతూ పేపర్లో వార్తలొస్తాయి. కానీ, గ్రౌండ్స్​మెన్ కృషిని ఎవ్వరూ ప్రశంసించరు. కానీ, ఆటగాళ్లు తప్పనిసరిగా వారిని గుర్తుపెట్టుకోవాలి. ఓ వ్యక్తి మంచి ప్లేయర్​గా ఎదిగేందుకు గ్రౌండ్స్​మెన్​ పరోక్షంగా సహాయం చేస్తారు. మంచి ట్రాక్​ సిద్ధం చేస్తారు" అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

ఇదీ చదవండి:

Sourav Ganguly Covid: బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీకి కరోనా

Ambati Rayudu News: మరో మూడేళ్లు క్రికెట్ ఆడతా: రాయుడు

Surya Kumar Yadav Donation: టీమ్​ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ లోకల్​ టోర్నమెంట్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. పర్సీ జిమ్​ఖానా, పయ్యాడే స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్​లో 152 బంతుల్లో 259 పరుగులు చేశాడు. అనంతరం 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు'ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ఈ అవార్డును మైదానంలోని గ్రౌండ్స్​మెన్​కు కానుకగా ఇచ్చి అందరి మనసను గెలుచుకున్నాడు.

"పిచ్​ను తయారు చేయడం కోసం గ్రౌండ్స్​మెన్ ఎంతో శ్రమిస్తారు. అందరికన్నా ముందు వారే గ్రౌండ్​కు వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. ఇంతచేసినా వారికి సరైన గుర్తింపు ఉండదు. ఆరంభంలో క్రికెట్ ఆడటానికి ముందు నేను కూడా గ్రౌండ్స్​​మెన్​తో కలిసి పిచ్​ను రోల్​ చేసేందుకు వెళ్లేవాడిని."

-సూర్యకుమార్ యాదవ్, టీమ్​ఇండియా ఆటగాడు.

చాలా మంది క్రికెటర్లు.. గ్రౌండ్స్​మెన్​ పనితీరును మర్చిపోతారని సూర్యకుమార్​ అభిప్రాయపడ్డాడు. కానీ, వారితో తనకున్న అనుబంధం అందరిలా కాదని చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు తప్పనిసరిగా గ్రౌండ్స్​మెన్​ చేసే పనిని గుర్తుపెట్టుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

suryakumar yadav
సూర్య కుమార్ యాదవ్

'ఓ క్రికెటర్​ గొప్పగా ఆడితే అందరూ అతడినే ప్రశంసిస్తారు. తర్వాత రోజు అతడిని పొగుడుతూ పేపర్లో వార్తలొస్తాయి. కానీ, గ్రౌండ్స్​మెన్ కృషిని ఎవ్వరూ ప్రశంసించరు. కానీ, ఆటగాళ్లు తప్పనిసరిగా వారిని గుర్తుపెట్టుకోవాలి. ఓ వ్యక్తి మంచి ప్లేయర్​గా ఎదిగేందుకు గ్రౌండ్స్​మెన్​ పరోక్షంగా సహాయం చేస్తారు. మంచి ట్రాక్​ సిద్ధం చేస్తారు" అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

ఇదీ చదవండి:

Sourav Ganguly Covid: బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీకి కరోనా

Ambati Rayudu News: మరో మూడేళ్లు క్రికెట్ ఆడతా: రాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.