ETV Bharat / sports

'అదే నా తొలి మ్యాచ్.. ఫస్ట్ బాల్​కే కోహ్లీ సిక్స్ కొట్టమన్నాడు.. కానీ'

author img

By

Published : Apr 6, 2022, 2:16 PM IST

Updated : Apr 6, 2022, 2:48 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున అద్భుతంగా రాణించి.. టీమ్​ఇండియాలో చోటు సంపాదించాడు యువ ఓపెనర్​ ఇషాన్​ కిషన్​. టీ20, వన్డే అరంగేట్ర మ్యాచ్​ల్లోనే అర్ధసెంచరీలు చేశాడు. అయితే.. తన తొలి మ్యాచ్​కు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడించాడు ఇషాన్​.

Ishan Kishan recalls Virat Kohli advice on international debut
Ishan Kishan recalls Virat Kohli advice on international debut

Ishan Kishan Kohli Advice: ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్​లో విశేషంగా రాణించి.. టీమ్​ఇండియాలో చోటు దక్కించుకున్నాడు యువ ఓపెనర్​ ఇషాన్​ కిషన్​. దేశవాళీల్లోనూ జార్ఖండ్​కు ఆడిన కిషన్​.. ఎన్నో పరుగులు చేశాడు. తన టీ-20, వన్డే అరంగేట్ర మ్యాచ్​ల్లోనూ అర్ధసెంచరీలు చేశాడు ఈ యువ వికెట్​కీపర్​- బ్యాటర్​. గతేడాది మార్చి 14న ఇంగ్లాండ్​తో రెండో టీ-20లో ఇతడికి ఆడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ కెరీర్​లో ఇషాన్​కు అదే తొలి మ్యాచ్​. 165 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్​ రాహుల్​తో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభిస్తాడు. తొలి ఓవర్లోనే అన్ని బంతులాడి రాహుల్​ అవుటవుతాడు. ఆ తర్వాత కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపిస్తాడు ఇషాన్​ కిషన్​. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ కూడా ఇషాన్​కే దక్కింది. అయితే.. ఆరోజు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బ్రేక్​ఫాస్ట్​ విత్​ ఛాంపియన్స్​ యూట్యూబ్​ షోలో వెల్లడించాడు స్టార్​ ఓపెనర్​. రెండో ఓవర్​ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​లో తొలి బంతికే సిక్స్​ కొట్టమని కోహ్లీ చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు ఇషాన్​. కానీ.. అది ఫోర్​ వెళ్లిందని చెప్పుకొచ్చాడు.

''నేను రాహుల్​తో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభించా. అతడు అవుట్​ కాగానే కోహ్లీ వచ్చాడు. అప్పటికి నాకు బ్యాటింగ్​ చేసే అవకాశం రాలేదు. రెండో ఓవర్​ బౌలింగ్​ వేసేది జోఫ్రా ఆర్చర్​. అప్పుడే కోహ్లీ నా దగ్గరికి వచ్చి.. 'అటు చూడు.. అక్కడ ఫీల్డర్​ ఎవరూ లేరు. సిక్స్​ కొట్టు' అన్నాడు. వెంటనే.. నేను షాక్​తో 'ఉమ్​.. అక్కడ ఆర్చర్​!' అని చెప్పా. కానీ.. కోహ్లీ చెప్పినదాని గురించి ఆలోచిస్తే.. నిజమే అనిపించింది. అదే ఏరియాలో కొట్టా. కానీ బంతి ఫోర్​ వెళ్లింది. ఆర్చర్​ బౌలింగ్​లో నా అంతర్జాతీయ కెరీర్​లో ఎదుర్కొన్న తొలి బంతికి బౌండరీ వెళ్లినందుకు సంతోషపడ్డా.''

- ఇషాన్​ కిషన్​

అదే ఏడాది వన్డే అరంగేట్రం కూడా చేశాడు ఇషాన్​. టీమ్​ఇండియా ప్రధాన జట్టు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లగా.. శిఖర్​ ధావన్​ నేతృత్వంలో, రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అప్పుడు ఇషాన్​ కిషన్​ ఈ జట్టుకు ఎంపికయ్యాడు. తన తొలి వన్డేలోనే 42 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్​, రెండో బంతిని ఫోర్​గా మలచడం విశేషం. అప్పుడు ధావన్​తో జరిగిన సంభాషణను కూడా ఇషాన్​ గుర్తుచేసుకున్నాడు. ''నేను తొలి బంతికి సిక్స్​, రెండో బంతికి ఫోర్​ కొట్టా. వెంటనే ధావన్​ వచ్చి.. 'బ్రో ఏంటి ప్లాన్​?' అని అడిగాడు. బంతిని సరిగా చూసి కొడుతున్నట్లు చెప్పానని'' అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున అదరగొడుతున్నాడు కిషన్​. ఆడిన రెండు మ్యాచ్​ల్లో 135 పరుగులు చేశాడు. ఈసారి మెగా వేలంలో ఇషాన్​ను రికార్డు స్థాయిలో రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​.

ఇవీ చూడండి: 'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్​ అయిపోయా'

ఆరెంజ్​​, పర్పుల్​ క్యాప్​ ఎవరిదగ్గర?.. ఏ జట్టు టాప్​..

Ishan Kishan Kohli Advice: ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్​లో విశేషంగా రాణించి.. టీమ్​ఇండియాలో చోటు దక్కించుకున్నాడు యువ ఓపెనర్​ ఇషాన్​ కిషన్​. దేశవాళీల్లోనూ జార్ఖండ్​కు ఆడిన కిషన్​.. ఎన్నో పరుగులు చేశాడు. తన టీ-20, వన్డే అరంగేట్ర మ్యాచ్​ల్లోనూ అర్ధసెంచరీలు చేశాడు ఈ యువ వికెట్​కీపర్​- బ్యాటర్​. గతేడాది మార్చి 14న ఇంగ్లాండ్​తో రెండో టీ-20లో ఇతడికి ఆడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ కెరీర్​లో ఇషాన్​కు అదే తొలి మ్యాచ్​. 165 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్​ రాహుల్​తో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభిస్తాడు. తొలి ఓవర్లోనే అన్ని బంతులాడి రాహుల్​ అవుటవుతాడు. ఆ తర్వాత కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపిస్తాడు ఇషాన్​ కిషన్​. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ కూడా ఇషాన్​కే దక్కింది. అయితే.. ఆరోజు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బ్రేక్​ఫాస్ట్​ విత్​ ఛాంపియన్స్​ యూట్యూబ్​ షోలో వెల్లడించాడు స్టార్​ ఓపెనర్​. రెండో ఓవర్​ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్​ బౌలింగ్​లో తొలి బంతికే సిక్స్​ కొట్టమని కోహ్లీ చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు ఇషాన్​. కానీ.. అది ఫోర్​ వెళ్లిందని చెప్పుకొచ్చాడు.

''నేను రాహుల్​తో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభించా. అతడు అవుట్​ కాగానే కోహ్లీ వచ్చాడు. అప్పటికి నాకు బ్యాటింగ్​ చేసే అవకాశం రాలేదు. రెండో ఓవర్​ బౌలింగ్​ వేసేది జోఫ్రా ఆర్చర్​. అప్పుడే కోహ్లీ నా దగ్గరికి వచ్చి.. 'అటు చూడు.. అక్కడ ఫీల్డర్​ ఎవరూ లేరు. సిక్స్​ కొట్టు' అన్నాడు. వెంటనే.. నేను షాక్​తో 'ఉమ్​.. అక్కడ ఆర్చర్​!' అని చెప్పా. కానీ.. కోహ్లీ చెప్పినదాని గురించి ఆలోచిస్తే.. నిజమే అనిపించింది. అదే ఏరియాలో కొట్టా. కానీ బంతి ఫోర్​ వెళ్లింది. ఆర్చర్​ బౌలింగ్​లో నా అంతర్జాతీయ కెరీర్​లో ఎదుర్కొన్న తొలి బంతికి బౌండరీ వెళ్లినందుకు సంతోషపడ్డా.''

- ఇషాన్​ కిషన్​

అదే ఏడాది వన్డే అరంగేట్రం కూడా చేశాడు ఇషాన్​. టీమ్​ఇండియా ప్రధాన జట్టు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లగా.. శిఖర్​ ధావన్​ నేతృత్వంలో, రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అప్పుడు ఇషాన్​ కిషన్​ ఈ జట్టుకు ఎంపికయ్యాడు. తన తొలి వన్డేలోనే 42 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్​, రెండో బంతిని ఫోర్​గా మలచడం విశేషం. అప్పుడు ధావన్​తో జరిగిన సంభాషణను కూడా ఇషాన్​ గుర్తుచేసుకున్నాడు. ''నేను తొలి బంతికి సిక్స్​, రెండో బంతికి ఫోర్​ కొట్టా. వెంటనే ధావన్​ వచ్చి.. 'బ్రో ఏంటి ప్లాన్​?' అని అడిగాడు. బంతిని సరిగా చూసి కొడుతున్నట్లు చెప్పానని'' అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున అదరగొడుతున్నాడు కిషన్​. ఆడిన రెండు మ్యాచ్​ల్లో 135 పరుగులు చేశాడు. ఈసారి మెగా వేలంలో ఇషాన్​ను రికార్డు స్థాయిలో రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​.

ఇవీ చూడండి: 'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్​ అయిపోయా'

ఆరెంజ్​​, పర్పుల్​ క్యాప్​ ఎవరిదగ్గర?.. ఏ జట్టు టాప్​..

Last Updated : Apr 6, 2022, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.