ETV Bharat / sports

IPL 2023 :​ పాండ్యకు బిగ్​ షాక్​.. అలా చేసినందుకు రూ.12 లక్షలు ఫైన్!

author img

By

Published : Apr 14, 2023, 3:27 PM IST

Updated : Apr 14, 2023, 4:01 PM IST

IPL 2023 : ఐపీఎల్​ జట్టు గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ హార్దిక్​​ పాండ్యకు షాక్​ తగిలింది. ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రూ.12 లక్షల ఫైన్​ పడింది.

IPL 2023 hardik pandya fine
IPL 2023 hardik pandya fine

ఐపీఎల్​ గుజరాత్​ టైటాన్స్​ జట్టు కెప్టెన్ హార్దిక్​ పాండ్యకు పెద్ద షాక్​ తగిలింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా రూ.12 లక్షలు ఫైన్​ పడింది. పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ నమోదు​ చేసినందుకు ఈ జరిగినా విధించారు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రతి​ మ్యాచ్​ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలి. కానీ స్లో ఓవర్​ రేట్​ కారణంగా చాలా మ్యాచ్​లు 4 గంటలకు పైగా సాగుతున్నాయి. ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళి ప్రకారం హార్దిక్​ పాండ్య జట్టు మొదటి తప్పని.. అందుకే రూ. 12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్​ మీడియా సలహాదారు శుక్రవారం తెలిపారు.

గురువారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోహిత్​ శర్మ 2/18తో మెరిశాడు. ఇక యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్ 67 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఐపీఎల్​ 16వ సీజన్​లో మొత్తంగా 4 మ్యాచ్​లు ఆడిన గుజరాత్​ మూడింట్లో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఈ ఐపీఎల్​ సీజన్​లో​ ఇలాంటి తప్పుకు ఫైన్​ పడటం ఇదేం మొదటి సారి కాదు. ఇలాంటి తప్పుల వల్ల హార్దిక్​ పాండ్య కంటే ముందు డుప్లెసిస్​, సంజు శాంసన్​కు​ కూడా పెనాల్టీ విధించారు. స్లో ఓవర్ రేట్​ కారణంగా ఆర్​సీబీ కెప్టెన్​ డుప్లెసిస్​కు రూ. 12 లక్షల ఫైన్​ విధించారు. ఇదే కాకుండా ఏప్రిల్​ 11న ఆర్​సీబీ, లఖ్​నవూ మధ్య జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ బ్యాటర్​ ఆవేశ్​ ఖాన్​.. చివరి బంతికి పరుగు పూర్తి చేసి జట్టుకు గెలిపించినందుకు ఆనందంలో తన హెల్మెట్​ను నేలకు కొట్టాడు. దీంతో అతడి ప్రవర్తనకు గానూ మ్యాచ్​ రిఫరీ ఆవేశ్​ ఖాన్​ను మందలించాడు.

గురువారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో తాము గెలిచినప్పటికీ.. జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై హార్దిక్​ పాండ్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. " నిజాయతీగా చెప్పాలంటే.. నేను మా జట్టు ప్లేయర్లను ఆభినందించాలని అనుకోవట్లేదు. సులభంగా గెలిచే స్థితి నుంచి ఆఖరు బాల్​ వరకు ఆడాల్సి వచ్చింది. మిడిల్​ ఓవర్లలో తాము ఎక్కువ రిస్క్​లు తీసుకోవాల్సింది. ఈ విషయంపై దృష్టి సారిస్తాం" అని హార్దిక్​ అన్నాడు. అయితే, ఈ మ్యాచ్​ చివరి బంతి వరకు ఎటూ తేలలేదు. ఆఖరు క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐపీఎల్​ గుజరాత్​ టైటాన్స్​ జట్టు కెప్టెన్ హార్దిక్​ పాండ్యకు పెద్ద షాక్​ తగిలింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా రూ.12 లక్షలు ఫైన్​ పడింది. పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ నమోదు​ చేసినందుకు ఈ జరిగినా విధించారు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రతి​ మ్యాచ్​ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలి. కానీ స్లో ఓవర్​ రేట్​ కారణంగా చాలా మ్యాచ్​లు 4 గంటలకు పైగా సాగుతున్నాయి. ఐపీఎల్​ ప్రవర్తనా నియమావళి ప్రకారం హార్దిక్​ పాండ్య జట్టు మొదటి తప్పని.. అందుకే రూ. 12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్​ మీడియా సలహాదారు శుక్రవారం తెలిపారు.

గురువారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోహిత్​ శర్మ 2/18తో మెరిశాడు. ఇక యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్ 67 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఐపీఎల్​ 16వ సీజన్​లో మొత్తంగా 4 మ్యాచ్​లు ఆడిన గుజరాత్​ మూడింట్లో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఈ ఐపీఎల్​ సీజన్​లో​ ఇలాంటి తప్పుకు ఫైన్​ పడటం ఇదేం మొదటి సారి కాదు. ఇలాంటి తప్పుల వల్ల హార్దిక్​ పాండ్య కంటే ముందు డుప్లెసిస్​, సంజు శాంసన్​కు​ కూడా పెనాల్టీ విధించారు. స్లో ఓవర్ రేట్​ కారణంగా ఆర్​సీబీ కెప్టెన్​ డుప్లెసిస్​కు రూ. 12 లక్షల ఫైన్​ విధించారు. ఇదే కాకుండా ఏప్రిల్​ 11న ఆర్​సీబీ, లఖ్​నవూ మధ్య జరిగిన మ్యాచ్​లో లఖ్​నవూ బ్యాటర్​ ఆవేశ్​ ఖాన్​.. చివరి బంతికి పరుగు పూర్తి చేసి జట్టుకు గెలిపించినందుకు ఆనందంలో తన హెల్మెట్​ను నేలకు కొట్టాడు. దీంతో అతడి ప్రవర్తనకు గానూ మ్యాచ్​ రిఫరీ ఆవేశ్​ ఖాన్​ను మందలించాడు.

గురువారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో తాము గెలిచినప్పటికీ.. జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై హార్దిక్​ పాండ్య అసంతృప్తి వ్యక్తం చేశాడు. " నిజాయతీగా చెప్పాలంటే.. నేను మా జట్టు ప్లేయర్లను ఆభినందించాలని అనుకోవట్లేదు. సులభంగా గెలిచే స్థితి నుంచి ఆఖరు బాల్​ వరకు ఆడాల్సి వచ్చింది. మిడిల్​ ఓవర్లలో తాము ఎక్కువ రిస్క్​లు తీసుకోవాల్సింది. ఈ విషయంపై దృష్టి సారిస్తాం" అని హార్దిక్​ అన్నాడు. అయితే, ఈ మ్యాచ్​ చివరి బంతి వరకు ఎటూ తేలలేదు. ఆఖరు క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 14, 2023, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.