ETV Bharat / sports

'ఆర్సీబీ నన్ను అడగలేదు.. వైదొలిగాక కోహ్లీ అలా అన్నాడు'

IPL 2022 Yuzvendra Chahal: జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్‌ చెప్పాడు. రాయల్​ ఛాలెంజర్స్​ జట్టుతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

author img

By

Published : Mar 29, 2022, 2:52 PM IST

IPL 2022 news
Yuzvendra Chahal news

IPL 2022 Yuzvendra Chahal: రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు​ జట్టుతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్. ఆర్సీబీ నుంచి వైదొలిగిన తర్వాత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో మాట్లాడానని చెప్పాడు. "నీవు ఎప్పుడూ రాయల్​వే అంటూ" కోహ్లీ తనను అభినందించాడని తెలిపాడు. జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్‌ చెప్పాడు.

"నా మొదట కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది. రాజస్థాన్‌ తరపున ఆడేందుకు ఎదురు చూస్తున్నా. బెంగళూరుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ జట్టుతో భావోద్వేగ బంధం ఏర్పరుచుకున్నా. ఆ జట్టుకు కాకుండా మరో జట్టుకు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమాల్లో అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. బెంగళూరు డైరెక్టర్‌ హెసన్‌ నాకు ఫోన్‌ చేసి ముగ్గురు ఆటగాళ్ల (కోహ్లి, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌)ను అట్టిపెట్టుకుంటున్నామని చెప్పారు. నన్ను అట్టిపెట్టుకునే విషయం కానీ లేదా డబ్బు గురించి కానీ ఏం అడగలేదు. వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. ఒకవేళ వాళ్లు జట్టుతో కొనసాగిస్తామని చెబితే సంతోషంగా ఒప్పుకునేవాణ్ని. డబ్బు ముఖ్యం కాదు. బెంగళూరు నాకెంతో ఇచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌కు ఆడబోతున్నంత మాత్రాన నా బౌలింగ్‌ మారదు. జెర్సీ మాత్రమే మారింది. వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న మా జట్టు టైటిల్‌ గెలిచే అవకాశం ఉంది"

-యుజ్వేంద్ర చాహల్, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు

చాహల్​ 2014 నుంచి 2021 వరకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది జరిగిన మెగావేలంలో రాజస్థాన్​ రాయల్స్​ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది. 2010లో రాజస్థాన్ జట్టులో ఉన్నా.. అప్పుడు మైదానంలో దిగే అవకాశం రాలేదు. అప్పటినుంచి ఆర్సీబీ ఆడిన ప్రతి మ్యాచ్​లో ప్రాతినిధ్యం వహించి.. 23 సగటుతో 126 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చదవండి: IPL 2022: రాజస్థాన్​తో నేడే సన్​రైజర్స్​ ఢీ.. శుభారంభం దక్కేనా?

IPL 2022 Yuzvendra Chahal: రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు​ జట్టుతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్. ఆర్సీబీ నుంచి వైదొలిగిన తర్వాత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో మాట్లాడానని చెప్పాడు. "నీవు ఎప్పుడూ రాయల్​వే అంటూ" కోహ్లీ తనను అభినందించాడని తెలిపాడు. జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్‌ చెప్పాడు.

"నా మొదట కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది. రాజస్థాన్‌ తరపున ఆడేందుకు ఎదురు చూస్తున్నా. బెంగళూరుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ జట్టుతో భావోద్వేగ బంధం ఏర్పరుచుకున్నా. ఆ జట్టుకు కాకుండా మరో జట్టుకు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమాల్లో అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. బెంగళూరు డైరెక్టర్‌ హెసన్‌ నాకు ఫోన్‌ చేసి ముగ్గురు ఆటగాళ్ల (కోహ్లి, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌)ను అట్టిపెట్టుకుంటున్నామని చెప్పారు. నన్ను అట్టిపెట్టుకునే విషయం కానీ లేదా డబ్బు గురించి కానీ ఏం అడగలేదు. వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. ఒకవేళ వాళ్లు జట్టుతో కొనసాగిస్తామని చెబితే సంతోషంగా ఒప్పుకునేవాణ్ని. డబ్బు ముఖ్యం కాదు. బెంగళూరు నాకెంతో ఇచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌కు ఆడబోతున్నంత మాత్రాన నా బౌలింగ్‌ మారదు. జెర్సీ మాత్రమే మారింది. వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న మా జట్టు టైటిల్‌ గెలిచే అవకాశం ఉంది"

-యుజ్వేంద్ర చాహల్, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు

చాహల్​ 2014 నుంచి 2021 వరకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది జరిగిన మెగావేలంలో రాజస్థాన్​ రాయల్స్​ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది. 2010లో రాజస్థాన్ జట్టులో ఉన్నా.. అప్పుడు మైదానంలో దిగే అవకాశం రాలేదు. అప్పటినుంచి ఆర్సీబీ ఆడిన ప్రతి మ్యాచ్​లో ప్రాతినిధ్యం వహించి.. 23 సగటుతో 126 వికెట్లను పడగొట్టాడు.

ఇదీ చదవండి: IPL 2022: రాజస్థాన్​తో నేడే సన్​రైజర్స్​ ఢీ.. శుభారంభం దక్కేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.