IPL 2022: ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ రెచ్చిపోయాడు. 32 బంతుల్లోనే 60 బాదాడు. దీంతో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. ఓపెనర్ శిఖర్ ధావన్ (33), జితేశ్ శర్మ (26) రాణించారు. కెప్టెన్ మయాంక్ సహా ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు.
చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, ప్రిటోరియస్ 2, ముఖేశ్, బ్రావో, జడేజా, తలో వికెట్ పడగొట్టారు.