ETV Bharat / sports

'ప్రతి ఒక్కరి సంక్షేమం ముఖ్యమే.. అందుకే వాయిదా'

author img

By

Published : May 4, 2021, 2:41 PM IST

ఐపీఎల్​ నిరవధిక వాయిదాపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టోర్నీతో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమం తమకు ముఖ్యమని తెలిపారు. ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.

jai shah, bcci secretery
జై షా, బీసీసీఐ కార్యదర్శి

ఇండియన్ ప్రీమియర్​ లీగ్(ఐపీఎల్​) నిరవధిక వాయిదాపై భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి స్పందించారు. లీగ్​తో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.

"ఐపీఎల్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కలిసి ఏకపక్షంగా లీగ్​ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. లీగ్​తో సంబంధమున్న ఆటగాళ్లు, ఉద్యోగులు, గ్రౌండ్స్​మెన్, మ్యాచ్​ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం మాకు ముఖ్యమే. వీరి విషయంలో మేము రాజీపడబోం."

-జై షా, బీసీసీఐ కార్యదర్శి.

ఐపీఎల్​లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సన్​రైజర్స్​ ఆటగాడు వృద్ధిమాన్​ సాహాతో సహా దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ మిశ్రాకు తాజాగా కొవిడ్ నిర్ధరణ అయింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్​లు, సహాయక సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.

ఇవీ చదవండి: నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్​ఓసీ

ఐపీఎల్-2021​ వాయిదా- బీసీసీఐ ప్రకటన

ఇండియన్ ప్రీమియర్​ లీగ్(ఐపీఎల్​) నిరవధిక వాయిదాపై భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి స్పందించారు. లీగ్​తో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.

"ఐపీఎల్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కలిసి ఏకపక్షంగా లీగ్​ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. లీగ్​తో సంబంధమున్న ఆటగాళ్లు, ఉద్యోగులు, గ్రౌండ్స్​మెన్, మ్యాచ్​ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం మాకు ముఖ్యమే. వీరి విషయంలో మేము రాజీపడబోం."

-జై షా, బీసీసీఐ కార్యదర్శి.

ఐపీఎల్​లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సన్​రైజర్స్​ ఆటగాడు వృద్ధిమాన్​ సాహాతో సహా దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ మిశ్రాకు తాజాగా కొవిడ్ నిర్ధరణ అయింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్​లు, సహాయక సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.

ఇవీ చదవండి: నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్​ఓసీ

ఐపీఎల్-2021​ వాయిదా- బీసీసీఐ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.