ETV Bharat / sports

ఐపీఎల్​ వీక్షణల్లో 21 శాతం పెరుగుదల

గతేడాది ఐపీఎల్​తో పోలిస్తే ప్రస్తుతం వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. ఒక్కో మ్యాచ్​కు దాదాపు 11 మిలియన్ల మంది ప్రేక్షకులు పెరిగారు. దీంతోపాటు వాణిజ్య ప్రకటనల విలువ కూడా పెరిగిందని ఓ అధ్యయనం తెలిపింది.

author img

By

Published : Oct 1, 2020, 9:56 PM IST

IPL's viewership increase by 21%, total viewers reached 269 million in the first week
ఐపీఎల్​ ప్రేక్షకుల శాతంలో 21 శాతం పెరుగుదల

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ ప్రారంభవారంలో దాదాపు 269 మిలియన్ల మంది టోర్నీని వీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఒక్కో మ్యాచ్​కు 11 మిలియన్ల మంది ప్రేక్షకులు పెరిగారు. వీక్షకులతో పాటు 15 శాతం ప్రకటనలూ పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది.

ఓ అధ్యయనం ప్రకారం.. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్​లో ఒక్క మ్యాచ్​ సగటున చూసే వారిలో 21 శాతం ప్రేక్షకులు పెరిగారు. ప్రతి ముగ్గురు టెలివిజన్​ ప్రేక్షకులలో ఒకరు ఐపీఎల్​ను చూస్తున్నారని.. 44 శాతం మంది టెలివిజన్ చూసే కుటుంబాలు టోర్నీని చూస్తున్నారని తెలుస్తోంది. ప్రకటనల విలువలో కూడా మొదటి ఆరు మ్యాచ్​ల తర్వాత 15 శాతం పెరుగుదల కనిపించింది.

IPL's viewership increase by 21%, total viewers reached 269 million in the first week
డ్రీమ్​ఎలెవన్​ ఐపీఎల్​

ఓటీటీలోనూ వీక్షకుల సంఖ్య 32 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్​ ప్రారంభమైన వారంలో స్పోర్ట్స్​ యాప్స్​, ఫాంటసీ స్పోర్ట్స్​ యాప్​ల గురించి అంతర్జాలంలో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుత ఐపీఎల్​లో ఆరంభ మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య జరగ్గా.. ఆ మ్యాచ్​ను 52 మిలియన్ల మంది వీక్షించారు. అంటే గతేడాదితో పోలిస్తే 29 శాతం ఎక్కువ. టోర్నీలోని రెండు నుంచి ఏడో మ్యాచ్​ వరకు 34 మిలియన్ల మంది ప్రేక్షకులను పెంచుకుంటూ పోతూ.. దాదాపు వంద మిలియన్ల వీక్షణలు లభించాయి. అందులో 15 నుంచి 21 మధ్య వయసుగల వారే ఎక్కువగా ఉన్నారు.

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ ప్రారంభవారంలో దాదాపు 269 మిలియన్ల మంది టోర్నీని వీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఒక్కో మ్యాచ్​కు 11 మిలియన్ల మంది ప్రేక్షకులు పెరిగారు. వీక్షకులతో పాటు 15 శాతం ప్రకటనలూ పెరిగాయని ఓ నివేదిక పేర్కొంది.

ఓ అధ్యయనం ప్రకారం.. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్​లో ఒక్క మ్యాచ్​ సగటున చూసే వారిలో 21 శాతం ప్రేక్షకులు పెరిగారు. ప్రతి ముగ్గురు టెలివిజన్​ ప్రేక్షకులలో ఒకరు ఐపీఎల్​ను చూస్తున్నారని.. 44 శాతం మంది టెలివిజన్ చూసే కుటుంబాలు టోర్నీని చూస్తున్నారని తెలుస్తోంది. ప్రకటనల విలువలో కూడా మొదటి ఆరు మ్యాచ్​ల తర్వాత 15 శాతం పెరుగుదల కనిపించింది.

IPL's viewership increase by 21%, total viewers reached 269 million in the first week
డ్రీమ్​ఎలెవన్​ ఐపీఎల్​

ఓటీటీలోనూ వీక్షకుల సంఖ్య 32 శాతం పెరుగుదల కనిపించింది. ఐపీఎల్​ ప్రారంభమైన వారంలో స్పోర్ట్స్​ యాప్స్​, ఫాంటసీ స్పోర్ట్స్​ యాప్​ల గురించి అంతర్జాలంలో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుత ఐపీఎల్​లో ఆరంభ మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య జరగ్గా.. ఆ మ్యాచ్​ను 52 మిలియన్ల మంది వీక్షించారు. అంటే గతేడాదితో పోలిస్తే 29 శాతం ఎక్కువ. టోర్నీలోని రెండు నుంచి ఏడో మ్యాచ్​ వరకు 34 మిలియన్ల మంది ప్రేక్షకులను పెంచుకుంటూ పోతూ.. దాదాపు వంద మిలియన్ల వీక్షణలు లభించాయి. అందులో 15 నుంచి 21 మధ్య వయసుగల వారే ఎక్కువగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.